Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలిచేవారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులతోపాటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.
వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ, నెట్టింట ఎప్పుడూ ఏదో వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత.. నాగచైతన్యపైన లేనిపోని నిందలు వేసింది. కానీ నాగచైతన్య మాత్రం సమంతను ఒక్కమాట కూడా అనలేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అంటూ కామెంట్ చేశాడు. అంతేకానీ సమంతలాగా ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ గా మారింది.
విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య.. సమంత కోసం తనకి ఇష్టమైన పనులు చేస్తున్నాడని తెలుస్తుంది. సమంతకి చెట్లు అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. సమంతకి చెట్లు, గ్రీనరీ, నేచర్ అంటే చాలా ఇష్టం. సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు కొంచెం సమయం దొరికినా గార్డెనింగ్ చేసేవారట. ఈ క్రమంలోనే ఇద్దరూ విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉన్న టైంలో పెంచుకున్న మొక్కలను నాగచైతన్య భద్రంగా తన దగ్గర దాచుకున్నాడట. ఇప్పటికీ వాటికి నీరు పోస్తూ మంచి కండిషన్లో పెట్టాడట చైతూ. సామ్ వదిలేసినా కానీ చైతన్య ఇంకా ఆమె జ్ఞాపకాలతోనే ఉన్నాడంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…