Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలిచేవారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులతోపాటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.
వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ, నెట్టింట ఎప్పుడూ ఏదో వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత.. నాగచైతన్యపైన లేనిపోని నిందలు వేసింది. కానీ నాగచైతన్య మాత్రం సమంతను ఒక్కమాట కూడా అనలేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అంటూ కామెంట్ చేశాడు. అంతేకానీ సమంతలాగా ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ గా మారింది.
విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య.. సమంత కోసం తనకి ఇష్టమైన పనులు చేస్తున్నాడని తెలుస్తుంది. సమంతకి చెట్లు అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. సమంతకి చెట్లు, గ్రీనరీ, నేచర్ అంటే చాలా ఇష్టం. సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు కొంచెం సమయం దొరికినా గార్డెనింగ్ చేసేవారట. ఈ క్రమంలోనే ఇద్దరూ విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉన్న టైంలో పెంచుకున్న మొక్కలను నాగచైతన్య భద్రంగా తన దగ్గర దాచుకున్నాడట. ఇప్పటికీ వాటికి నీరు పోస్తూ మంచి కండిషన్లో పెట్టాడట చైతూ. సామ్ వదిలేసినా కానీ చైతన్య ఇంకా ఆమె జ్ఞాపకాలతోనే ఉన్నాడంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…