MS Dhoni : భారత క్రికెట్ జట్టును మహేంద్ర సింగ్ ధోనీ ఎంత విజయవంతంగా నడిపించాడో అందరికీ తెలిసిందే. ధోనీ సారథ్యంలో టీమిండియా టీ20, వన్డే వరల్డ్కప్లతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజయం సాధించింది. ఇక అటు ఐపీఎల్లోనూ ధోనీ చెన్నైకి అనేక విజయాలను కట్టబెట్టాడు. 2020 ఐపీఎల్ టోర్నీలో చెన్నై పేలవమైన ప్రదర్శన చూపించినా.. 2021లో మాత్రం మరోమారు ట్రోఫీని సాధించి సత్తా చాటారు. ఇదంతా ధోనీ చలవే అని ఫ్యాన్స్ ఎవర్ని అడిగినా చెబుతారు.
అయితే వచ్చ ఏడాది ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నారు. దీంతో కేవలం కొద్ది మంది ప్రముఖ ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకుని మిగిలిన వారిని వేలంలో ప్రవేశపెట్టాయి. దీంతో ఈసారి 250 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక చెన్నై టీమ్ కూడా ఈ సారి భారీ ఎత్తున మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ధోనీ, జడేజా వంటి వారిని మాత్రమే దగ్గరే పెట్టుకోనుంది.
ఇక ఈ సారి ఐపీఎల్ లో ధోనీ ఆడుతాడని నిర్దారణ అవుతున్నా.. కెప్టెన్గా మాత్రం ధోనీ కొనసాగడని తెలుస్తోంది. ధోనీ తన కెప్టెన్సీని రవీంద్ర జడేజా లేదా రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ధోనీ ఓ వైపు టీమ్లో ఉంటూనే మరోవైపు కెప్టెన్గా వేరే ప్లేయర్ను నియమించనున్నారు. దీంతో జట్టు భవిష్యత్తులోనూ మరింత బలంగా ఉంటుందని మేనేజ్మెంట్ విశ్వసిస్తోంది. అయితే వచ్చే ఐపీఎల్లో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…