Mrunal Thakur : మృణాల్ ఠాకుర్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. మొదట్లో హిందీ సీరియల్స్ లో నటించి సీతారామం మూవీతో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకుంది మృణాల్. ఈ చిత్రంలో యువరాణిలా అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ భామ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పటికే ఆమె వైజయంతి బ్యానర్లో ఓ సినిమాకు సంతకం చేసిందని, మరిన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది. సీతారామం చిత్రం సక్సెస్ ని అందుకోవడంతో మృణాల్ ఠాకూర్ కి ఇన్స్టా ఖాతాలో ఫాలోవర్స్ బాగా పెరిగారు. ఇది ఇలా ఉంటే మృణాల్కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఈ ఫొటోలో అయితే ఆమెకు స్కిన్ అలర్జీ రావడంతో ఇలా నల్లగా కమిలిపోయి కనిపిస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే అసలు ఇది మృణాల్ ఠాకూర్ ఫోటో కాదని వాదిస్తున్నారు. ఇంకొంత మంది ఇది ఏదైనా సినిమా షూటింగ్ కోసం మృణాల్ ఇలా తయారు అయి ఉంటుందని చెప్పుకొచ్చారు. గతంలో తను నటించిన ఓ సీరియల్లోని లుక్ అయ్యుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఫొటో ఎప్పటిది అనేది మాత్రం క్లారిటీ లేదు.
మొత్తానికి సీతారామం చిత్రంలో చీరకట్టులో గ్లామర్స్ లుక్ తో ఎంతో మంది మనసు దోచుకున్న మృణాల్ ఈ ఫొటోలో పూర్తిగా డీగ్లామర్తో కనిపించి అందరికీ షాకిచ్చింది. మృణాల్ ఠాకూర్ కుంకుమ భాగ్య అనే హిందీ సిరియల్తో పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ లో హీరోయిన్కి చెల్లిగా మృణాల్ నటించింది. ఈ సీరియల్ తెలుగులో సైతం మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలో సూపర్ 30, జర్సీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి ఘనమైన విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడిియాలో హల్చల్ చేస్తున్న మృణాల్ డీ గ్లామరస్ ఫోటో కి గల కారణం ఏంటో మృణాల్ స్పందిస్తేనే తెలుస్తుంది.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…