Mrunal Thakur : మృణాల్ ఠాకుర్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. మొదట్లో హిందీ సీరియల్స్ లో నటించి సీతారామం మూవీతో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకుంది మృణాల్. ఈ చిత్రంలో యువరాణిలా అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి తెలుగు చిత్రంతోనే మృణాల్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ భామ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పటికే ఆమె వైజయంతి బ్యానర్లో ఓ సినిమాకు సంతకం చేసిందని, మరిన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా నిజానికి మృణాల్ ఠాకూర్ ఇప్పటికే పాన్ ఇండియా చిత్రాలలో నటించాల్సి ఉండగా ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాలో నటించే ఛాన్స్ ను మృణాల్ మిస్ చేసుకుంది. 2015 లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. హీరో ప్రభాస్ మరియు డైరెక్టర్ రాజమౌళి క్రేజ్ బహుబలి చిత్రంతో వంద రెట్లు పెరిగిపోయింది.
అయితే ఈ సినిమాలో మృణాల్ చాన్స్ మిస్ చేసుకుంది హీరోయిన్ గా కాదు. సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రలో నటించే ఛాన్స్ ను మృణాల్ కోల్పోయింది. జక్కన్న బాహుబలి సినిమా కోసం ముంబైలో కూడా ఆడిషన్స్ నిర్వహించారట. ఆ ఆడిషన్స్ లో మృణాల్ ను ఎంపిక చేశారట. కానీ ఆ తరవాత ఏమైందో తెలియదు గానీ రాజమౌళి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అలా ఫైనల్ గా శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేయడం జరిగిందట.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…