OTT : కరోనా సమయంలో పెద్దగా సినిమాల సందడి లేదనే చెప్పాలి. కరోనా కాస్త శాంతించాక ప్రతి వారం ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో అరడజనుకి పైగా సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇందులో తెలుగుతోపాటు పలు భాషలకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ 5, హాట్ స్టార్, సోనీ లివ్తో పాటు ఇతర ప్లాట్ ఫామ్లలో ఎప్పటికప్పుడు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న మూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కీర్తి, సురేష్ సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సాని కాయిదం చిత్రం మే 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు.ఇందులో కీర్తి సురేష్ మాస్ లుక్లో అదరగొట్టనుంది.
అమితాబ్ బచ్చన్ నటించిన జుండ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. మే 6న జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ తప్పక అలరిస్తుంది.
కన్నడ భాషకు చెందిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందగా, ఇందులో ధర్మన్న కడూర్, కె జయరామ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మే 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తోంది.
హిందీ భాషకు సంబంధించిన థ్రిల్లర్ థార్ మూవీ. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇది నెట్ఫ్లిక్స్ లో మే 6వ తేదీన ప్రీమియర్ అవనుంది. 80ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందింది.
ఇక థియేటర్లలో ప్రదర్శించబడే సినిమాల విషయానికి వస్తే..
యంగ్ హీరో శ్రీవిష్ణు మెయిన్ లీడ్ లో వస్తోన్న భళా తందనాన సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వారాహి చలన చిత్రం పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించగా, కేథరిన్ హీరోయిన్ గా నటించింది.
యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన సుమ వెండితెరపై నటించిన మూవీ జయమ్మ పంచాయతీ.. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఇందులో పల్లెటూరి మహిళ పాత్రలో సుమ కనిపించనుంది.
కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడిన అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…