Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగ భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అయితే తాజాగా ఈ చిత్రానికి చెందిన అఫిషియల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. ఇందులో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు.
సాధారణంగా మహేష్ బాబు తన సినిమాల్లో కామెడీ చేయడం తక్కువే. అలా చేసిన ఖలేజా మూవీ ఫ్లాప్ అయింది. కనుక కామెడీ జోలికి మహేష్ ఎక్కువగా వెళ్లడం లేదు. కానీ సర్కారు వారి పాట ట్రైలర్ను చూస్తే మహేష్ కాస్త కామెడీ ఎక్కువగా చేశాడనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు సాఫ్ట్ డైలాగ్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ను ఆకట్టుకున్న మహేష్ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను మాట్లాడడం మొదలు పెట్టాడు. సర్కారు వారి పాట ట్రైలర్ను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అందులో ఆయన రెండు చోట్ల డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారు.
ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోంచి విడుదలైన కళావతి, పెన్నీ పాటలతోపాటు టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇక మూవీలో మహేష్ లుక్, డైలాగ్స్, ఫైట్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ అప్పుడే ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇక సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…