OTT : వారం వారం కొత్త సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారం మారాక ఈ వారం ఏయే మూవీలు రిలీజ్ అవుతున్నాయి.. అని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుత తరుణంలో ఓటీటీల పుణ్యమా అని థియేటర్లలో వచ్చిన సినిమాలను నెల రోజులు తిరక్కుండానే ఓటీటీల్లో వీక్షిస్తున్నారు. దీంతో ఓటీటీ సంస్థలు కూడా కొత్త మూవీలను ప్రేక్షకులకు అందించేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన సమ్మతమే మూవీ ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఆహా ప్లాట్ఫామ్పై ఈ నెల 15వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అలాగే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన వాశి అనే మళయాళం మూవీ కూడా ఈ వారంలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీని ఈ నెల 17వ తేదీన నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయనున్నారు.
ఇక విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మామణిథన్ అనే తమిళ మూవీని ఆహా తమిళ యాప్లో ఈ నెల 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మా నీళ్ల ట్యాంక్ అనే కామెడీ డ్రామా సిరీస్లో సుశాంత్, ప్రియా ఆనంద్ నటించగా.. ఈ సిరీస్ జీ5 యాప్లో ఈ నెల 15వ తేదీన రిలీజ్ కానుంది.
పంచాయత్ ఫేమ్ జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జాదుగర్ అనే సిరీస్ను నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సిరీస్ ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఇది హిందీలో అందుబాటులో ఉంటుంది. ఇలా పలు మూవీలు, సిరీస్లు ప్రేక్షకులను ఈ వారం అలరించనున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…