కర్ణాటకలోని బెంగుళూరులో వికలాంగురాలైన నాలుగేళ్ల చిన్నారిని నాలుగవ అంతస్తు నుంచి తోసేసి చంపేసింది ఓ కన్న తల్లి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కిరణ్, సుష్మ భరద్వాజ్ అనే దంపతులు నివసిస్తున్నారు. భర్త కిరణ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, భార్య సుష్మ డెంటిస్ట్. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది.
ఈ చిన్నారి ఎదుగుదల పుట్టినప్పటి నుంచి సరిగా లేదు. చిన్నారి మాట్లాడలేదు. మెదడు ఎదుగుదల సరిగా లేని బాలిక పరిస్థితిని చూసి ఆమె తల్లి సుష్మ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. దీంతో శుక్రవారం సాయంత్రం తల్లి సుష్మ తన ఇంటి నాలుగో అంతస్తు బాల్కనీలో తన బిడ్డను చేతుల్లో పట్టుకుని నిల్చుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని కిందకు తోసేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
నిందితురాలు సుష్మా భరద్వాజ్ తన బిడ్డను విసిరివేసిన అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందని, అయితే ఇరుగుపొరుగు వారు రక్షించారని పోలీసులు తెలిపారు. సుష్మా భర్త కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా సుష్మ భరద్వాజ్ తన కూతురిని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న కిరణ్ వెంటనే స్టేషన్కు చేరుకుని తమ కుమార్తెను గుర్తించాడని పోలీసులు తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…