ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడానికి కొంత టైం పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ను సొంతం చేసుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది.
పుష్ప సినిమాతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది. పుష్ప విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం రష్మికకు ఇన్స్టాగ్రామ్ లో 6 మిలియన్లకు పైగా ఫాల్లోవర్స్ ఉన్నారు.
రష్మిక క్రేజ్, డిమాండ్ పెరిగిపోవడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట. పుష్ప విడుదలకు ముందు ఆమెకు 2 కోట్ల రూపాయలు ఇచ్చే వారట. ఇప్పుడు హిందీ సినిమాలకు 4 కోట్లకు పైగా, తెలుగు సినిమాలకు 3 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుందట రష్మిక మందన్న. ఇంత భారీ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తునప్పటికీ నిర్మాతలు కూడా అమెకున్న క్రేజ్ ను బట్టి ఓకే అనేస్తున్నారట.
పుష్ప 2 : ది రూల్ కోసం ఆమె 4 కోట్ల రూపాయల భారీ మొత్తం తీసుకోనుందట. రష్మిక నటించిన సీతా రామం శుక్రవారం విడుదల కాగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే రష్మిక ప్రస్తుతం తమిళ తలపతి విజయ్ తో వారసుడులో నటిస్తోంది. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ లో నటించనుంది రష్మిక. దీనికి సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…