Monkeys : ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ అనే ప్రాంతంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పసికందును కోతులు తస్కరించి వాటర్ ట్యాంకులో పడేశాయి. దీంతో నీటిలో మునిగిన ఆ చిన్నారి చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి.. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ అనే ప్రాంతంలో కేశవ కుమార్ అనే 2 నెలల పసికందును తన బామ్మ మంచంలో పడుకోబెట్టుకుంది. వారు భవనం పైన టెర్రస్ మీద ఉన్న అంతస్థులో ఓ గదిలో నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఆ వృద్ధురాలు గది తలుపులు పెట్టలేదు.
ఈ క్రమంలోనే కొన్ని కోతులు అటుగా వచ్చాయి. నిద్రిస్తున్న పసికందును తన బామ్మ నుంచి లాక్కుని అక్కడే పక్కన ఉన్న వాటర్ ట్యాంకులో పడేశాయి. అయితే ఆ వృద్ధురాలికి మెళకువ వచ్చి చూడా.. పక్కనే నిద్రిస్తూ ఉండాల్సిన తన మనవడు కనిపించలేదు. దీంతో ఆమె అందరికీ విషయం చెప్పింది. వారందరూ చుట్టూ అంతటా గాలించారు. చివరకు ఆ పసికందు మృతదేహం వాటర్ ట్యాంకులో కనిపించింది. దీంతో ఆ కుటుంబం పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.
అయితే ఈ విషయంపై చండీనగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఓపీ సింగ్ మాట్లాడుతూ.. వాస్తవానికి ఆ ఏరియాలో కోతుల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుంచి అనేక మార్లు ఫిర్యాదులు వచ్చాయని.. ఈ విషయాన్ని తాము స్థానిక అటవీశాఖ అధికారులకు ఇప్పటికే తెలియజేశామని.. అయినప్పటికీ వారు చర్యలు తీసుకోలేదని తెలిపారు. లేదంటే ఈ ఘాతుకం జరిగి ఉండేది కాదన్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…