Mohan Babu : కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణగా పేరు తెచ్చుకున్న మోహన్బాబు ఎప్పుడూ కోపంగా కనిపిస్తుంటారు. ఆయన చీటికీ మాటికీ ఎవరిని పడితే వాళ్లను ఎంత మాట అంటే అంత మాట అనేస్తారని టాక్ ఉంది. అందుకనే ఆయన లేదా ఆయన కుమారుల సినిమాల్లో నటించేందుకు నటీనటులు ఆసక్తిని చూపించరట. అయితే వాస్తవానికి మోహన్ బాబు ముక్కు సూటిగా మాట్లాడతారు. ఆయన ఉన్నది ఉన్నట్లు ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేస్తారు. కనుకనే ఆయనపై అలాంటి ముద్ర పడిపోయిందని తెలుస్తోంది. అయితే మోహన్ బాబు అప్పట్లో ఓ హీరోయిన్ను షూటింగ్ స్పాట్లోనే చెంప చెళ్లుమనిపించారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు.
మోహన్బాబు అప్పట్లో ఓ హీరోయిన్ను షూటింగ్ స్పాట్లోనే చెంప దెబ్బ కొట్టారన్న వార్త బాగా ప్రచారం అయింది. దీంతో ఆయనను అందరూ నిందించారు. మోహన్బాబుకు చాలా అహంకారమని.. అందుకనే ఆ హీరోయిన్ పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటారని అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. అప్పట్లో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా తొలి సినిమా విష్ణు తీశారు. దీన్ని మోహన్ బాబు స్వయంగా తమ బ్యానర్ అయిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. దీనికి మళయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఇస్మాయిల్ దర్బార్ సంగీతం అందించారు. ఇందులో విష్ణుకు జోడీగా అప్పటి హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ నటించింది. విష్ణు సినిమా ఈమెకు కూడా మొదటి సినిమానే కావడం విశేషం.
అయితే శిల్పా శివానంద్ షూటింగ్కు టైముకు రాకపోయేదట. ఆమెకు ఎన్నో సార్లు చెప్పినా ఆమె పెడచెవిన పెట్టిందట. దీంతోపాటు దర్శకుడు చెప్పింది చేసేందుకు కొన్నిసార్లు అసలు ఒప్పుకోకపోయేదట. దీంతో ఎంత చెప్పినా విననందుకు గాను మోహన్ బాబు ఆమెను చెంప దెబ్బ కొట్టారట. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ దీని వల్ల మోహన్బాబుపై బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ వార్త అప్పట్లో బాగా ప్రచారం అయింది. దీంతో మోహన్బాబు కోపిష్టి అన్న ముద్ర పడిపోయింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…