Mohan Babu : కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణగా పేరు తెచ్చుకున్న మోహన్బాబు ఎప్పుడూ కోపంగా కనిపిస్తుంటారు. ఆయన చీటికీ మాటికీ ఎవరిని పడితే వాళ్లను ఎంత మాట అంటే అంత మాట అనేస్తారని టాక్ ఉంది. అందుకనే ఆయన లేదా ఆయన కుమారుల సినిమాల్లో నటించేందుకు నటీనటులు ఆసక్తిని చూపించరట. అయితే వాస్తవానికి మోహన్ బాబు ముక్కు సూటిగా మాట్లాడతారు. ఆయన ఉన్నది ఉన్నట్లు ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేస్తారు. కనుకనే ఆయనపై అలాంటి ముద్ర పడిపోయిందని తెలుస్తోంది. అయితే మోహన్ బాబు అప్పట్లో ఓ హీరోయిన్ను షూటింగ్ స్పాట్లోనే చెంప చెళ్లుమనిపించారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు.
మోహన్బాబు అప్పట్లో ఓ హీరోయిన్ను షూటింగ్ స్పాట్లోనే చెంప దెబ్బ కొట్టారన్న వార్త బాగా ప్రచారం అయింది. దీంతో ఆయనను అందరూ నిందించారు. మోహన్బాబుకు చాలా అహంకారమని.. అందుకనే ఆ హీరోయిన్ పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటారని అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. అప్పట్లో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా తొలి సినిమా విష్ణు తీశారు. దీన్ని మోహన్ బాబు స్వయంగా తమ బ్యానర్ అయిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. దీనికి మళయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఇస్మాయిల్ దర్బార్ సంగీతం అందించారు. ఇందులో విష్ణుకు జోడీగా అప్పటి హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ నటించింది. విష్ణు సినిమా ఈమెకు కూడా మొదటి సినిమానే కావడం విశేషం.
అయితే శిల్పా శివానంద్ షూటింగ్కు టైముకు రాకపోయేదట. ఆమెకు ఎన్నో సార్లు చెప్పినా ఆమె పెడచెవిన పెట్టిందట. దీంతోపాటు దర్శకుడు చెప్పింది చేసేందుకు కొన్నిసార్లు అసలు ఒప్పుకోకపోయేదట. దీంతో ఎంత చెప్పినా విననందుకు గాను మోహన్ బాబు ఆమెను చెంప దెబ్బ కొట్టారట. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ దీని వల్ల మోహన్బాబుపై బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ వార్త అప్పట్లో బాగా ప్రచారం అయింది. దీంతో మోహన్బాబు కోపిష్టి అన్న ముద్ర పడిపోయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…