NTR : విశ్వ విఖ్యాత నటనా సార్వభౌమ.. ఈ బిరుదు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే పేరు.. ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన చేయని పాత్ర లేదు. ఏ పాత్ర చేసినా అందులో జీవిస్తారు. ఆయన తెలుగు సినిమాకు వన్నె తెచ్చారు. ఇక కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఆయన రాణించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు. దీంతో ప్రజాకర్షక పాలన చేశారు. అయితే ఎన్టీఆర్ పేరునే హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పెట్టుకున్నారు. ఆ పేరును ఆయన తాతనే స్వయంగా ఆయనకు పెట్టారు. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించారు. 1983 మే 20న జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు. అయితే ఎన్టీఆర్ తన కుమారులకు కృష్ణ అనే పేరు చివర్లో వచ్చేలా పెట్టారు. కానీ హరికృష్ణ మాత్రం తన కొడుకులకు రామ్ అని చివర్లో వచ్చేలా పెట్టారు. రాముడు అంటే ఇష్టమని కనుకనే అలా పేరు పెట్టానని తెలిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్కు తారక రామ్ అని మొదట్లో పేరు పెట్టారు. ఈ క్రమంలోనే ఒకసారి హరికృష్ణ తన కుమారున్ని తీసుకుని ఎన్టీఆర్ వద్దకు వెళ్లారు.
అప్పుడు ఎన్టీఆర్.. తారక్ను నీ పేరు ఏంటి బాబు.. అని అడగ్గా.. తారక రామ్ అని సమాధానం చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. తన పేరును కొడుక్కి ఎందుకు పెట్టావని హరికృష్ణను అడిగారు. అయితే కృష్ణ అని పెట్టడం ఇష్టం లేక రామ్ అనే పేరు పెట్టానని.. అలాగే ఎన్టీఆర్ అనే తన తండ్రి పేరు కలిసేలా తారక్ అని ముందు పెట్టానని హరికృష్ణ తెలిపారు. దీంతో తారక్ రామ్ అయింది. అయితే కాసేపటి తరువాత సీనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి తారక్తో మాట్లాడుతూ.. నువ్వు నా అంశలో జన్మించావు.. కనుక నీ పేరు తారక రామారావు అని పిలవాలి. నువ్వు కూడా నాలాగే గొప్పవాడివి అవుతావు.. అని సీనియర్ ఎన్టీఆర్ తారక్ను ఆశీర్వదించారు. ఇలా తారక్ రామ్ కాస్తా తారక రామారావు అయింది. అప్పటి నుంచి తారక్ ఎన్టీఆర్గా కొనసాగుతున్నారు. అందుకనే ఆయనను ఇప్పటికీ తారక్ అని పిలుస్తుంటారు. ఇదీ.. తారక్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…