Mohan Babu : మా ఎన్నికలల్లో ప్రమాణ స్వీకారం సమయంలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. మా ఎన్నికల వేదిక రాజకీయ వేదిక కాదని.. ఇది కళాకారుల వేదికని అన్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన వేదికపై మంచు విష్ణు, ప్యానల్ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలు స్వీకరించారు. మనమంతా కళామ్మతల్లి బిడ్డలం అనీ, మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని.. అందుకే కేవలం టాలెంట్ తోనే ఇక్కడ రాణించగలమని అన్నారు.
నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో నేను విలన్ గా చేయాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా కూడా చేశాను అని తెలిపారు. అలాగే ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని, కేవలం కళాకారులే ఉండాలని అన్నారు. ఈ వేదిక మీద నువ్వు గొప్పా.. నేను గొప్పా అంటూ.. సినిమాలు ఉన్నాయా.. లేవా.. అనేది కాదని ఎంత కష్టపడి సినిమా చేసినా ఒక్కోసారి ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయని అన్నారు. అయితే జీవితంలో గెలుపు ఓటమి అనేవి సర్వసాధారణం అని అన్నారు.
సక్సెస్ వచ్చిందని అహానికి పోతే ఆ మరుక్షణమే దేవుడు తిప్పి కొడతాడని అన్నారు. మా ఎన్నికల సమయంలో మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది వ్యక్తులు బెదిరించారు. కానీ మేము ఆ బెదిరింపులకు భయపడలేదని, మా ఓటు మా ఇష్టమని, నా బిడ్డను గెలిపించినందుకు మీకు ఏం ఇచ్చి రుణం తీర్చుకుంటాను. నాకు పగ, రాగద్వేషాలు లేవని.. నా తెలివి తేటలతో, ఆవేశంతో క్రమశిక్షణతోనే ఇక్కడ వరకు వచ్చానని మోహన్ బాబు తెలిపారు.
అలాగే సినీ ఇండస్ట్రీలో పరిశ్రమ పెద్దల్ని గౌరవించాలనే ఉద్దేశ్యంతో తాను ఇక్కడికి వచ్చే ముందు తాను కృష్ణని కూడా కలిశానని అన్నారు. దాదాపు 600 మందికి ఫోన్ చేసినట్లు తెలిపారు. మా సభ్యులకు ఇళ్ళ నిర్మాణం, వారి సమస్యలపై పరిష్కారం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి మాట్లాడతానని అన్నారు. ఇది మన అసోసియేషన్ అని ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం కావాలని.. అలాగే మా అధ్యక్ష పదవిని మంచు విష్ణుకు అప్పగించినందుకు తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తాడని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…