Mohan Babu : మా ఎన్నికలల్లో ప్రమాణ స్వీకారం సమయంలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. మా ఎన్నికల వేదిక రాజకీయ వేదిక కాదని.. ఇది కళాకారుల వేదికని అన్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన వేదికపై మంచు విష్ణు, ప్యానల్ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలు స్వీకరించారు. మనమంతా కళామ్మతల్లి బిడ్డలం అనీ, మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని.. అందుకే కేవలం టాలెంట్ తోనే ఇక్కడ రాణించగలమని అన్నారు.
నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో నేను విలన్ గా చేయాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా కూడా చేశాను అని తెలిపారు. అలాగే ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని, కేవలం కళాకారులే ఉండాలని అన్నారు. ఈ వేదిక మీద నువ్వు గొప్పా.. నేను గొప్పా అంటూ.. సినిమాలు ఉన్నాయా.. లేవా.. అనేది కాదని ఎంత కష్టపడి సినిమా చేసినా ఒక్కోసారి ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయని అన్నారు. అయితే జీవితంలో గెలుపు ఓటమి అనేవి సర్వసాధారణం అని అన్నారు.
సక్సెస్ వచ్చిందని అహానికి పోతే ఆ మరుక్షణమే దేవుడు తిప్పి కొడతాడని అన్నారు. మా ఎన్నికల సమయంలో మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది వ్యక్తులు బెదిరించారు. కానీ మేము ఆ బెదిరింపులకు భయపడలేదని, మా ఓటు మా ఇష్టమని, నా బిడ్డను గెలిపించినందుకు మీకు ఏం ఇచ్చి రుణం తీర్చుకుంటాను. నాకు పగ, రాగద్వేషాలు లేవని.. నా తెలివి తేటలతో, ఆవేశంతో క్రమశిక్షణతోనే ఇక్కడ వరకు వచ్చానని మోహన్ బాబు తెలిపారు.
అలాగే సినీ ఇండస్ట్రీలో పరిశ్రమ పెద్దల్ని గౌరవించాలనే ఉద్దేశ్యంతో తాను ఇక్కడికి వచ్చే ముందు తాను కృష్ణని కూడా కలిశానని అన్నారు. దాదాపు 600 మందికి ఫోన్ చేసినట్లు తెలిపారు. మా సభ్యులకు ఇళ్ళ నిర్మాణం, వారి సమస్యలపై పరిష్కారం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి మాట్లాడతానని అన్నారు. ఇది మన అసోసియేషన్ అని ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం కావాలని.. అలాగే మా అధ్యక్ష పదవిని మంచు విష్ణుకు అప్పగించినందుకు తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తాడని అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…