Chandra Babu Naidu : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారిద్దరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. ఏపీ అంతటా గురువారం జనాగ్రహ దీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో నిర్వహించిన దీక్షలో రోజా పాల్గొని మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్, పట్టాభిలు సీఎం జగన్ను క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. పట్టాభి లాంటి కుక్కలతో సీఎం జగన్ను తిట్టించిన చంద్రబాబుకు సిగ్గులేదని, లోకేష్ ఒక కొండెర్రిపప్ప అని రోజా ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్లను తిట్టిస్తే భువనేశ్వరి ఊరుకుంటారా ? అని రోజా ప్రశ్నించారు.
కుట్రపూరిత రాజకీయాలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని రోజా ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బూతులకు తెగబడుతుందని, బద్వేలులో మీ బతుకేంటో తేలిపోతుందని అన్నారు. మరోవైపు ఏపీ అంతటా జనాగ్రహ దీక్షలను వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…