MLA Raja Singh : తొలిసారి సమంత పుష్ప సినిమా కోసం స్పెషల్ డ్యాన్స్ చేయగా, ఇందులో ఈ అమ్మడు తన డ్యాన్స్తో ఇరగదీసింది. ఈ పాటకు సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సాంగ్కి సంబంధించి వివాదం కొనసాగుతున్న నేథ్యంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐటమ్ సాంగ్స్ని దేవుడిని పూజిస్తూ చెప్పే శ్లోకాలతో పోల్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ సమాజాన్ని, హిందూ దేవుళ్లని కించపరిచేలా దేవిశ్రీ వ్యాఖ్యలున్నాయని అభ్యంతరం చెప్పారు. మీరు సినిమాలు తీయండి.. గ్రాండ్గా సక్సెస్ చేసుకోండి కానీ ఇలాంటి వ్యాఖ్యలేంటని ఆయన ప్రశ్నించారు. దేవుడి శ్లోకాలకు ఐటమ్ సాంగ్స్కి తేడా లేదా ? మీరు కావాలని చేశారా.. అనుకోకుండా చేశారా ? అంత అవసరమేముందని రాజా సింగ్ నిలదీశారు. హిందూ సమాజం, హిందూ సైన్యం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకపోతే మరోలా మాట్లాడాల్సి వస్తుందని రాజా సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా టీంతో కలసి పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ తను కంపోజ్ చేసిన రింగ రింగా.. ఊ అంటావా మావ ఊఊ అంటావా పాటలను భక్తి గీతాలుగా మార్చి పాడారు. అంతేకాకుండా ఐటమ్ సాంగ్స్, భక్తి శ్లోకాలు తన దృష్టిలో ఒకటే అని చెప్పడంతో వివాదం రేగింది. దీనిపై క్షమాపణలు చెప్పాల్సిందేనని రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…