MLA Raja Singh : తొలిసారి సమంత పుష్ప సినిమా కోసం స్పెషల్ డ్యాన్స్ చేయగా, ఇందులో ఈ అమ్మడు తన డ్యాన్స్తో ఇరగదీసింది. ఈ పాటకు సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సాంగ్కి సంబంధించి వివాదం కొనసాగుతున్న నేథ్యంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐటమ్ సాంగ్స్ని దేవుడిని పూజిస్తూ చెప్పే శ్లోకాలతో పోల్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ సమాజాన్ని, హిందూ దేవుళ్లని కించపరిచేలా దేవిశ్రీ వ్యాఖ్యలున్నాయని అభ్యంతరం చెప్పారు. మీరు సినిమాలు తీయండి.. గ్రాండ్గా సక్సెస్ చేసుకోండి కానీ ఇలాంటి వ్యాఖ్యలేంటని ఆయన ప్రశ్నించారు. దేవుడి శ్లోకాలకు ఐటమ్ సాంగ్స్కి తేడా లేదా ? మీరు కావాలని చేశారా.. అనుకోకుండా చేశారా ? అంత అవసరమేముందని రాజా సింగ్ నిలదీశారు. హిందూ సమాజం, హిందూ సైన్యం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకపోతే మరోలా మాట్లాడాల్సి వస్తుందని రాజా సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా టీంతో కలసి పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ తను కంపోజ్ చేసిన రింగ రింగా.. ఊ అంటావా మావ ఊఊ అంటావా పాటలను భక్తి గీతాలుగా మార్చి పాడారు. అంతేకాకుండా ఐటమ్ సాంగ్స్, భక్తి శ్లోకాలు తన దృష్టిలో ఒకటే అని చెప్పడంతో వివాదం రేగింది. దీనిపై క్షమాపణలు చెప్పాల్సిందేనని రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…