Mehreen : డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. కరోనా సమయంలో ప్రజలు ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు లోనయ్యారనే కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మెహరీన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇందులో పద్దు అనే ఒక సాఫ్ట్ వేర్ పాత్రలో తాను కనిపిస్తానని ఇందులో ఎంతో అల్లరి చేష్టలు, ఫన్నీగా సాగిపోయే పాత్ర తనదని తెలియజేసింది. ఇక కరోనా సమయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందారు. వాటిని ఎలా ఎదుర్కొన్నారు.. అనే అంశంపై మంచిరోజులు వచ్చాయి అనే ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కిందని వెల్లడించింది.
తనకు జీవితంలో ఓ బేబీ సినిమాలోని సమంత పాత్రలో, మహానటి సినిమాలోని కీర్తి సురేష్ లాంటి పాత్రలలో నటించాలనే కోరిక ఉందని ఈ సందర్భంగా తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఇక తదుపరి తన సినిమాల విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3, కన్నడలో శివరాజ్ కుమార్ సరసన మరొక సినిమా చేస్తున్నట్లు ఈ సందర్భంగా మెహరీన్ చెప్పుకొచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…