Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం షూటింగ్లకు విరామం ఇచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే తన బస్సు యాత్ర కోసం పలు వాహనాలను కూడా కొనుగోలు చేశారు. అక్టోబర్ 5 నుంచి షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి 6 నెలల పాటు ఆయన బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. ఇక అప్పటి వరకు సినిమాలు చేసేందుకు కాల్ షీట్స్ ఇచ్చారట. అయితే ఆ గ్యాప్లో ఆయన వినోదయ సీతం సినిమాను పూర్తి చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ఇక అటకెక్కేసినట్లేనని అంటున్నారు.
వాస్తవానికి హరిహర వీరమల్లును ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ వల్ల ఆలస్యం అయింది. దీంతో ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ భీమ్లా నాయక్ రిలీజ్ అనంతరం ప్రారంభం అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ మళ్లీ ఆగినట్లు తెలుస్తోంది. పవన్ సూచించిన విధంగా దర్శకుడు క్రిష్ మార్పులు చేయలేదని.. కనుక ఆ మార్పులు జరిగే వరకు షూటింగ్ను పవన్ ఆపారని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నీ బాగున్నాయనుకుంటే ఈ మూవీకి మరో ఆటంకం కలిగింది. పవన్ పొలిటికల్ టూర్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ మూవీ మరో ఆచార్య అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అప్పట్లో ఆచార్య మూవీకి కూడా ఇలాగే జరిగింది. సినిమాను అనౌన్స్ చేశాక కోవిడ్ వల్ల ఆలస్యం కాగా.. తరువాత పలు కారణాల వల్ల సినిమా విడుదల ఆగింది. తరువాత ఎట్టకేలకు సినిమాను రిలీజ్ చేసినా.. దానిపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గింది. దీంతోపాటు సినిమాకు చివరి నిమిషంలో అనేక మార్పులు చేశారు. వెరసి.. ఆచార్య ఫలితం దారుణంగా వచ్చింది. ఈ మూవీని మెగా ఫ్యాన్స్ తమ మెమొరీలోంచి తీసేయాలని చూస్తున్నారు. కానీ హరిహర వీరమల్లు కూడా ఆచార్యను తలపిస్తుందని అంటున్నారు. ఈ మూవీ కూడా ఆచార్య లాగే ఆలస్యం అయితే అప్పుడు ఫలితం కూడా ఆచార్య లాగే వస్తుందని.. దీంతో హరిహర వీరమల్లు మరో ఆచార్య అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ ఆచార్య లాగే ఆలస్యం అవుతుందా.. లేక వేగంగా పూర్తి చేస్తారా.. అన్న వివరాలు వేచి చూస్తే తెలుస్తాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…