Manoj Desai : విజయ్ దేవరకొండ ఎప్పుడూ తన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అది దూకుడు స్వభావంతో కానివ్వండి లేదా పరిణతి చెందిన వ్వక్తిగా కానివ్వండి, ఏదైనా ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు ఈ విషయం మరొకసారి రుజువైంది. అయితే ఇటీవల ముంబయిలోని జీ7 అనే మల్టీప్లెక్స్ యజమాని అయిన మనోజ్ దేశాయ్ అనే అతను లైగర్ సినిమా విడుదలపై కామెంట్ల విషయంలో విజయ్ ని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. నీ వల్ల మా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు పడిపోయాయి, నీకు బాగా పొగరు, నీకు అంత తలతిక్క ఉంటే నీ సినిమాలను ఓటీటీలో మాత్రమే విడుదల చేసుకో అంటూ విజయ్ దేవరకొండపై ఆయన చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి.
అయితే ఆయన ఇలా మాట్లాడిన వీడియో విజయ్ దేవరకొండ వద్దకు చేరింది. దీంతో నష్ట నివారణ చేయదలచుకున్న విజయ్ నేరుగా ముంబై వెళ్లి ఆయను కలవడం జరిగింది. అలా కలిసిన విజయ్ ఆయనతో మాట్లాడుతూ.. అసలు తను మీడియాతో మాట్లాడిన విషయం వేరని కానీ దానిలో చిన్న ముక్కను తీసుకొని ప్రచారం చేయడంతో అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ థియేటర్ ఓనర్ కి తన మనసులోని మాటను చెప్పాలనుకున్నట్టుగా అన్నాడు. ఇంకా తను ఎప్పడూ ప్రేక్షకులను తక్కువ చేసి మాట్లాడనని, వారి వల్లే తను ఈ స్థాయికి వచ్చానని, వారంటే తనకు ఎంతో ప్రేమ, గౌరవం అని అన్నాడు. అలాగే మీలాంటి పెద్ద వ్యక్తుల ఆశీర్వాదం తనకు కావాలని విజయ్ ఆ థియేటర్ యజమాని కాళ్లకు మొక్కాడు.
దీంతో ఆ థియేటర్ యజమాని కూడా విజయ్ ఇచ్చిన వివరణతో ఏకీభవించాడు. ఇక ఆయన మాట్లాడుతూ ఇందులో విజయ్ తప్పు ఏమీ లేదని అతను చాలా మంచి వ్యక్తి అని, తనది ఒదిగి ఉండే స్వభావమని, వినయ విధేయతలు గల మనిషి అనీ, ఇకపై విజయ్ సినిమాలన్నీ తన థియేటర్ లో విడుదల చేస్తానని విజయ్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసాడు. ఇంకా తాను ఎప్పుడూ ఎవరికీ సారీ చెప్పలేదనీ కానీ విజయ్ కి చెబుతున్నాని అన్నాడు. దీంతో విజయ్ తన గొప్ప వ్యక్తిత్వాన్ని మరొకసారి నిరూపించాడని, ఇంతటితో ఈ వివాదానికి తెర పడిందని సినీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…