Manchu Vishnu : మంచు విష్ణు అంటే టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఢీ లాంటి సూపర్ హిట్ సినిమాతో మంచు విష్ణు అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే మంచు విష్ణు దాదాపు 20 కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ ఢీ తర్వాత మళ్లీ అంతటి హిట్ సినిమాను అందుకోలేకపోయాడు. చివరగా మంచు విష్ణు మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ 21న.. మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా జిన్నా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్లు హీరోయిన్లుగా నటించారు. జిన్నా విడుదల సందర్భంగా విష్ణు వరుస ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నట్లు మంచు విష్ణు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కొందరు డబ్బులిచ్చి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారంటూ ఎప్పటినుంచో అంటూనే ఉన్నాడు. అయితే తనపై ట్రోల్స్ చేయిస్తోంది ఎవరో తనకి తెలుసని చెప్పుకొచ్చాడు. ఆ ఒక్కడు ఎవరన్నది ఇండస్ట్రీ, మీడియాలో ఉన్న వారందరికీ తెలుసు. వాళ్ల పేరు నేను నా నోటితో చెప్పాలనుకోవడం లేదు. నేను న్యూటన్ మూడో సూత్రాన్ని బాగా నమ్ముతాను.
ఎవ్రీ యాక్షన్ హ్యావ్ఏ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మనం సొసైటిలోకి పాజిటివ్ పంపితే పాజిటివ్ తిరిగి వస్తుంది. నెగెటివ్ పంపితే నెగెటివిటీనే మనకు వస్తుంది. నేను దేవుడిని, ప్రకృతిని బాగా నమ్ముతాను. మనం ఏదైతే ఇస్తామో.. అదే తిరిగి వస్తుంది. నాపై ట్రోల్స్ చేయిస్తున్న వారి పేరును కూడా నా నోటితో చెప్పాలి అని నేను అనుకోవడం లేదు. ఇంతకు ముందు నా మీద ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. నేను ఎప్పుడైతే మా ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచానో.. అప్పటి నుంచే నాపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది అంటూ తనపై వచ్చే ట్రోలింగ్ విషయం గురించి మరోసారి ప్రస్తావించాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు అలా చేస్తున్నాడు అనే విషయాలను మాత్రం చెప్పలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…