Manchu Vishnu : మంచు విష్ణు అంటే టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఢీ లాంటి సూపర్ హిట్ సినిమాతో మంచు విష్ణు అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే మంచు విష్ణు దాదాపు 20 కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ ఢీ తర్వాత మళ్లీ అంతటి హిట్ సినిమాను అందుకోలేకపోయాడు. చివరగా మంచు విష్ణు మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ 21న.. మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా జిన్నా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్లు హీరోయిన్లుగా నటించారు. జిన్నా విడుదల సందర్భంగా విష్ణు వరుస ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నట్లు మంచు విష్ణు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కొందరు డబ్బులిచ్చి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారంటూ ఎప్పటినుంచో అంటూనే ఉన్నాడు. అయితే తనపై ట్రోల్స్ చేయిస్తోంది ఎవరో తనకి తెలుసని చెప్పుకొచ్చాడు. ఆ ఒక్కడు ఎవరన్నది ఇండస్ట్రీ, మీడియాలో ఉన్న వారందరికీ తెలుసు. వాళ్ల పేరు నేను నా నోటితో చెప్పాలనుకోవడం లేదు. నేను న్యూటన్ మూడో సూత్రాన్ని బాగా నమ్ముతాను.
ఎవ్రీ యాక్షన్ హ్యావ్ఏ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మనం సొసైటిలోకి పాజిటివ్ పంపితే పాజిటివ్ తిరిగి వస్తుంది. నెగెటివ్ పంపితే నెగెటివిటీనే మనకు వస్తుంది. నేను దేవుడిని, ప్రకృతిని బాగా నమ్ముతాను. మనం ఏదైతే ఇస్తామో.. అదే తిరిగి వస్తుంది. నాపై ట్రోల్స్ చేయిస్తున్న వారి పేరును కూడా నా నోటితో చెప్పాలి అని నేను అనుకోవడం లేదు. ఇంతకు ముందు నా మీద ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. నేను ఎప్పుడైతే మా ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచానో.. అప్పటి నుంచే నాపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది అంటూ తనపై వచ్చే ట్రోలింగ్ విషయం గురించి మరోసారి ప్రస్తావించాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు అలా చేస్తున్నాడు అనే విషయాలను మాత్రం చెప్పలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…