Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు సమంత ప్రకటించిన తరువాత.. నిజానికి ఆమెనే ఎక్కువ మంది నిందించారు. ఆమె అబార్షన్ చేయించుకుంటానందని, పిల్లల్ని కనడం ఇష్టం లేదని, సరోగసీకి వెళ్దామని అన్నదని.. ఆమె నటించిన సిరీస్ లు, సినిమాల్లో బోల్డ్ కనిపించడం వల్లే.. అని ఇలా రక రకాలుగా వారి విడాకులకు సమంతనే నిందించారు. అయితే కొన్ని యూట్యూబ్ చానల్స్ ఈ విషయంలో హద్దు మీరి ప్రవర్తించాయి. దీంతో వారిపై పరువు నష్టం కేసు వేయగా.. అది కోర్టులో విచారణలో ఉంది.
అయితే తాజాగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. వేధింపులను ఎదుర్కొనే మా మహిళా సభ్యుల విషయంలో కీలక ప్రకటన చేశారు. అలాంటి మహిళా సభ్యులకు మా అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు. వ్యూస్ పెంచి పాపులర్ అవడం కోసం కొన్ని యూట్యూబ్ చానల్స్ హీరోయిన్లు, ఇతర నటీమణులపై లేని పోని తప్పుడు కథనాలను వీడియోలలో ప్రసారం చేస్తున్నాయని, తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి ప్రతిష్టను దిగజారుస్తున్నాయని.. అలాంటి చానల్స్ను విడిచిపెట్టబోమని.. మంచు విష్ణు స్పష్టం చేశారు.
ఇక యూట్యూబ్ చానల్స్ వేధింపుల వల్ల ఇబ్బందులకు గురయ్యే మా మహిళా సభ్యుల కోసం ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తామని తెలిపారు. అయితే మంచు విష్ణు చేసిన ప్రకటన సమంతకు వర్తిస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా.. విడాకుల ప్రకటనతో తీవ్ర డిప్రెషన్లో ఉన్నట్లు కనిపిస్తున్న సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది. అయినప్పటికీ పలు సినిమాలకు సంతకం చేసి ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…