Manchu Vishnu : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర నటీనటులకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్న విషయం విదితమే. అందుకనే ఫ్లాప్లను ఎదుర్కొన్నా.. కొన్ని సార్లు సొంత సంస్థల ఆధ్వర్యంలో సినిమాలు తీసి హిట్ కొట్టి మళ్లీ నటులు ఫామ్లోకి వస్తుంటారు. ఇందుకు వారికి తమ సొంత నిర్మాణ సంస్థలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.
ఇక సీనియర్ నటుడు మోహన్బాబుకు కూడా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వంటి నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కానీ అవి ఉన్నప్పటికీ మంచు హీరోలు సినిమాల్లో హిట్లు కొట్టలేకపోతున్నారు. అలాగే ఈ సంస్థల ఆధ్వర్యంలో ఇతర హీరోలతో సినిమాలు తీసినా వర్కవుట్ కావడం లేదు. అయితే ఇకపై మంచు విష్ణు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
మంచు విష్ణు అవా (ava) ఎంటర్టైన్మెంట్ పేరిట ఓ డిజిటల్ సంస్థను స్థాపించినట్లు సమాచారం. ఈ సంస్థ పేరిట వెబ్ సిరీస్లు, బడ్జెట్ మూవీలను తీయనున్నారట. వాటిని ఓటీటీల కోసమే ప్రత్యేకంగా తీస్తారట. దీంతో ఓటీటీలకు వాటిని విక్రయించి లాభాలు గడించవచ్చన్నమాట. ప్రస్తుతం.. రాబోతున్నది.. అంతా డిజిటల్, ఓటీటీల యుగమే కనుక.. ఈ దిశగా వ్యాపారం చేస్తే అయినా సక్సెస్ కావొచ్చని మంచు విష్ణు ఆలోచించారట. అందుకనే ఆ సంస్థను ఏర్పాటు చేశారట.
అయితే దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఇక దీంతోపాటు త్వరలోనే ఒక ఓటీటీ యాప్ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే త్వరలో మంచు వారి ఓటీటీ యాప్ కూడా రంగ ప్రవేశం చేస్తుందన్నమాట. మరి ఆహాకు అది పోటీనిస్తుందా.. లేదా.. అసలు మంచు వారు ఓటీటీ యాప్ను తెస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…