Manchu Vishnu : మా ఎన్నికల ఫలితాలపై మంచు విష్ణు కీలకవ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన ప్యానెల్ సభ్యులతో కలిసి మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో తనను విత్ డ్రా చేసుకోమని చిరంజీవి చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం చెప్పకూడదనుకున్నానని, అయితే ఎన్నికలు ముగిశాయి కాబట్టి చెబుతున్నానని అన్నారు.
రామ్చరణ్ తనకు మంచి స్నేహితుడని, తండ్రి చిరంజీవి మాటకు కట్టుబడి ప్రకాశ్రాజ్కే ఓటేసి ఉంటారని అన్నారు. రామ్చరణ్ స్థానంలో తాను ఉన్నా అదే చేస్తానని చెప్పారు. తన గెలుపుకు వంద శాతం తన తండ్రి మోహన్ బాబే కారణమని తెలిపారు. అలాగే నరేష్ కూడా తన గెలుపుకు ఎంతో కష్టపడ్డారని అన్నారు.
మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలని, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి తనకు ఓటు వేసి తనను ఆశీర్వదించారని అన్నారు. ఇక ప్రకాశ్రాజ్ ప్యానెల్లో గెలిచిన వారిని కూడా తమతో కలుపుకొని పోతామని, తామంతా ఒక్కటేనని తెలిపారు. అయితే ప్రకాష్ రాజ్, నాగబాబుల రాజీనామాలను ఆమోదించబోనని, వారితో కలసి మాట్లాడుతానని, వారి సలహాలతో ముందుకు సాగుతానని మంచు విష్ణు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…