Manchu Vishnu : మంచు విష్ణు ఫ్యామిలీ అంటే.. మొదట్నుంచీ వివాదాలకు కేరాఫ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు వీరు వివాదాల్లో చిక్కుకుపోతుంటారు. తరువాత సారీ చెబుతుంటారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మంచు లక్ష్మి.. ఈ ముగ్గురూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో వీరు వరుస వివాదాల్లో కూరుకుపోయారు. దీంతో మంచు ఫ్యామిలీ గతంలో ఎన్నడూ లేని విధంగా అప్రతిష్టను మూటగట్టుకుంది.
మంచు విష్ణు, మోహన్ బాబు ఈమధ్య సీఎం జగన్ను కలిసి ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు, ఇతర విషయాల్లో తామే సమస్యను పరిష్కరిస్తున్నట్లు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. గతంలో మంచు ఫ్యామిలీని మెచ్చుకున్నవారే ఈ విషయంలో తిట్టిపోశారు. అంటే.. వారు ఈ మధ్య కాలంలో ఎంతటి నెగెటివిటీని మూటగట్టుకున్నారో ఇట్టే అర్థం అవుతుంది. సినీ సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రేక్షకులు అందరూ మెగాస్టార్ చిరంజీవికే మద్దతు పలికారు.
ఇక వరుస వివాదాల్లో వారు ఇలా చిక్కుకుపోతుండడంతో మొన్నీ మధ్యే విడుదలైన మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మోహన్బాబు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉండేది. కానీ ఆయన కెరీర్లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. మొత్తం సినిమాకు రూ.35 లక్షలే వచ్చాయంటే వారిపై ప్రేక్షకులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది.
ఇక ఇది చాలదన్నట్లు తన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీనుపై మంచు విష్ణు ఫిర్యాదు చేయడం.. నాగశ్రీను బయటకు వచ్చి మంచు ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేయడంతో.. మరోసారి మంచు ఫ్యామిలీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు ఆ ఫ్యామిలీనే తేడా.. అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా.. వారు మాత్రం ఈ వివాదంపై అస్సలు ఇంకా స్పందించలేదు. వారు ఇలాగే వ్యవహరిస్తే.. ఉన్న ఆ కాస్త పేరు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పటికైనా మంచు ఫ్యామిలీ మేల్కొంటుందో.. లేదో.. చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…