Manchu Vishnu : మంచు విష్ణు ఫ్యామిలీ అంటే.. మొదట్నుంచీ వివాదాలకు కేరాఫ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు వీరు వివాదాల్లో చిక్కుకుపోతుంటారు. తరువాత సారీ చెబుతుంటారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మంచు లక్ష్మి.. ఈ ముగ్గురూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో వీరు వరుస వివాదాల్లో కూరుకుపోయారు. దీంతో మంచు ఫ్యామిలీ గతంలో ఎన్నడూ లేని విధంగా అప్రతిష్టను మూటగట్టుకుంది.
మంచు విష్ణు, మోహన్ బాబు ఈమధ్య సీఎం జగన్ను కలిసి ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు, ఇతర విషయాల్లో తామే సమస్యను పరిష్కరిస్తున్నట్లు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. గతంలో మంచు ఫ్యామిలీని మెచ్చుకున్నవారే ఈ విషయంలో తిట్టిపోశారు. అంటే.. వారు ఈ మధ్య కాలంలో ఎంతటి నెగెటివిటీని మూటగట్టుకున్నారో ఇట్టే అర్థం అవుతుంది. సినీ సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రేక్షకులు అందరూ మెగాస్టార్ చిరంజీవికే మద్దతు పలికారు.
ఇక వరుస వివాదాల్లో వారు ఇలా చిక్కుకుపోతుండడంతో మొన్నీ మధ్యే విడుదలైన మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మోహన్బాబు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉండేది. కానీ ఆయన కెరీర్లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. మొత్తం సినిమాకు రూ.35 లక్షలే వచ్చాయంటే వారిపై ప్రేక్షకులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది.
ఇక ఇది చాలదన్నట్లు తన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీనుపై మంచు విష్ణు ఫిర్యాదు చేయడం.. నాగశ్రీను బయటకు వచ్చి మంచు ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేయడంతో.. మరోసారి మంచు ఫ్యామిలీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు ఆ ఫ్యామిలీనే తేడా.. అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా.. వారు మాత్రం ఈ వివాదంపై అస్సలు ఇంకా స్పందించలేదు. వారు ఇలాగే వ్యవహరిస్తే.. ఉన్న ఆ కాస్త పేరు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పటికైనా మంచు ఫ్యామిలీ మేల్కొంటుందో.. లేదో.. చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…