కుక్కలు, పిల్లలు, పక్షలు, ఆవులు, గేదెలు.. లాంటి వాటిని పెంచుకుంటే ఫర్లేదు. వాటితో మనకు ఎలాంటి హాని ఉండదు. ఇవి ఎక్కడ తారస పడ్డా కూడా మనకు వీటితో ముప్పు ఉండదు. కానీ క్రూర మృగాలు అలా కాదు. వాటికి వీలైనంత దూరంగా ఉండాల్సిందే. సింహం, చిరుత, పులి లాంటి జంతువులను చూడాలని కోరుకోవాలి. కానీ వాటి దగ్గరకు మాత్రం వెళ్లకూడదు. మనం చిన్నతనం నుంచి ఈ విషయాలను నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ కొందరు ఈ విషయాలు తెలిసినా క్రూర మృగాలతో ఆటలు ఆడుతున్నారు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఓ జూలో పులి బోనులో ఉండగా.. దాన్ని కొందరు చూస్తున్నారు. అయితే కుక్కను దగ్గరకు పిలిచి దాని తలపై నిమిరినట్లు.. పులితో కూడా అలాగే చేద్దామని అనుకున్నాడు ఓ వ్యక్తి. దీంతో బోను దగ్గరగా వచ్చి అందులో ఉన్న పులిని పిలిచాడు. అది వచ్చినట్లే వచ్చి అతని చేతిలో ఉన్న పదార్థాన్ని తినేసింది. అంతేకాదు.. వెంటనే అతని చేతిని కూడా అందిపుచ్చుకుని కరకరా నమిలి మింగేసింది. దీంతో ఆ ప్రదేశం అంతా రక్తసిక్తమైంది. ఈ క్రమంలోనే ఈ మొత్తం సంఘటనను కొందరు వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. దీంతో చాలా మంది ఆ వీడియోపై స్పందిస్తున్నారు.
పులి అంటే క్రూర మృగం. దాంతో ఆటలా. కుక్కలాగే దాన్ని కూడా పెంపుడు జంతువులా భావించాడు.. చివరకు ఏమైందో చూడండి.. అలాంటి జంతువులు దగ్గరగా ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాటిని దగ్గరకు పిలిచి ఫుడ్ పెట్టడం ఏంటి. దయచేసి ఇలా ఎవరూ చేయొద్దు.. అంటూ నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
అయితే ఈ వీడియో ఎక్కడిది.. దీన్ని ఎవరు తీశారు.. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ దీన్ని చూసిన వారందరూ తీవ్రంగా షాక్కు గురవుతున్నారు. ఇలాంటి వీడియోను గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడాలని అంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…