కుక్కలు, పిల్లలు, పక్షలు, ఆవులు, గేదెలు.. లాంటి వాటిని పెంచుకుంటే ఫర్లేదు. వాటితో మనకు ఎలాంటి హాని ఉండదు. ఇవి ఎక్కడ తారస పడ్డా కూడా మనకు వీటితో ముప్పు ఉండదు. కానీ క్రూర మృగాలు అలా కాదు. వాటికి వీలైనంత దూరంగా ఉండాల్సిందే. సింహం, చిరుత, పులి లాంటి జంతువులను చూడాలని కోరుకోవాలి. కానీ వాటి దగ్గరకు మాత్రం వెళ్లకూడదు. మనం చిన్నతనం నుంచి ఈ విషయాలను నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ కొందరు ఈ విషయాలు తెలిసినా క్రూర మృగాలతో ఆటలు ఆడుతున్నారు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఓ జూలో పులి బోనులో ఉండగా.. దాన్ని కొందరు చూస్తున్నారు. అయితే కుక్కను దగ్గరకు పిలిచి దాని తలపై నిమిరినట్లు.. పులితో కూడా అలాగే చేద్దామని అనుకున్నాడు ఓ వ్యక్తి. దీంతో బోను దగ్గరగా వచ్చి అందులో ఉన్న పులిని పిలిచాడు. అది వచ్చినట్లే వచ్చి అతని చేతిలో ఉన్న పదార్థాన్ని తినేసింది. అంతేకాదు.. వెంటనే అతని చేతిని కూడా అందిపుచ్చుకుని కరకరా నమిలి మింగేసింది. దీంతో ఆ ప్రదేశం అంతా రక్తసిక్తమైంది. ఈ క్రమంలోనే ఈ మొత్తం సంఘటనను కొందరు వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. దీంతో చాలా మంది ఆ వీడియోపై స్పందిస్తున్నారు.
పులి అంటే క్రూర మృగం. దాంతో ఆటలా. కుక్కలాగే దాన్ని కూడా పెంపుడు జంతువులా భావించాడు.. చివరకు ఏమైందో చూడండి.. అలాంటి జంతువులు దగ్గరగా ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాటిని దగ్గరకు పిలిచి ఫుడ్ పెట్టడం ఏంటి. దయచేసి ఇలా ఎవరూ చేయొద్దు.. అంటూ నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
అయితే ఈ వీడియో ఎక్కడిది.. దీన్ని ఎవరు తీశారు.. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ దీన్ని చూసిన వారందరూ తీవ్రంగా షాక్కు గురవుతున్నారు. ఇలాంటి వీడియోను గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడాలని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…