Money : అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని.. ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెబుతూ డబ్బులు వసూలు చేసే వారిని అసలే నమ్మవద్దని.. పోలీసులు ఎంత చెబుతున్నా.. కొందరు మాత్రం వినిపించుకోవడం లేదు. ఫలితంగా లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. ఎంతో కష్టపడి సంపాదించే సొమ్మును నేరస్థుల పాలు చేస్తున్నారు. తాజాగా పూణెలో ఓ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పూణెకు చెందిన ఓ వ్యక్తి (27) తండ్రి కరోనా వల్ల చనిపోయాడు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న రూ.17 లక్షలు తన కొడుక్కి వచ్చాయి. అయితే ఆ డబ్బుతో అతను ఏదైనా వ్యాపారం చేసుకున్నా బాగుపడేవాడు కావచ్చు. కానీ అతను అలా అనుకోలేదు. అత్యాశకు పోయాడు. మేల్ ఎస్కార్ట్ సర్వీస్ (మగ వ్యభిచారులు) చేస్తే గంటకు రూ.3వేలు సంపాదించవచ్చని చెబుతూ ఆన్లైన్లో కనిపించిన ఓ యాడ్ను చూసి మోసపోయాడు.
సదరు యాడ్లో ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఆ వ్యక్తి ముందుగా కాల్ చేయగా.. వారు ఆ పని అప్పగించేందుకు గాను కొన్ని రకాల చార్జిలు అవుతాయని చెప్పారు. సర్వీస్ చార్జి, రూమ్ చార్జి, పోలీస్ వెరిఫికేషన్ చార్జి, పికప్ చార్జ్.. అని చెప్పి పలు దఫాల్లో లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ.17.38 లక్షల వరకు ఆ వ్యక్తి వారికి ట్రాన్స్ఫర్ చేశాడు. చివరికి వారు ఫోన్ స్విచాఫ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే తన తండ్రి చనిపోవడం వల్ల అతను దాచుకున్న రూ.17 లక్షలు ఆ వ్యక్తికి వచ్చినా.. అతను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. డబ్బును తీస్తుంటే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆ డబ్బును ఏం చేస్తున్నావని అడిగారు. ఇందుకు ఆ వ్యక్తి.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నానని చెబుతూ వచ్చాడు. చివరకు ఇలా చేశాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుని హతాశులయ్యారు. కాగా ఆ వ్యక్తి నగదు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ల వివరాలను సేకరించిన పోలీసులు అవి ఎవరివో తెలుసుకునే పనిలో పడ్డారు. ఎవరూ ఇలా నమ్మి మోసపోవద్దని పోలీసులు మరోమారు హెచ్చరించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…