తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఆమెను ఐరన్ రాడ్తో కొట్టి చంపేశాడు. అందరూ చూస్తుండగానే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మంగను స్థానికంగా ఉంటున్న ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే మంగ నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గోపాల్ రెడ్డి దంపతులు తమ రెండో కుమార్తె స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరి కాపురం గత ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా సాగింది. ఈ క్రమంలోనే వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు.
అయితే గత కొంత కాలంగా స్వప్నపై ఎల్లారెడ్డికి అనుమానం ఏర్పడింది. తన భార్య ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతను అనుమానించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆ అనుమానం పెరిగి పెద్దదైంది. ఆదివారం సాయంత్రం తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న స్వప్నపై ఎల్లారెడ్డి దాడి చేశాడు. ఐరన్ రాడ్తో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని కోసం గాలిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…