తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఆమెను ఐరన్ రాడ్తో కొట్టి చంపేశాడు. అందరూ చూస్తుండగానే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మంగను స్థానికంగా ఉంటున్న ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే మంగ నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గోపాల్ రెడ్డి దంపతులు తమ రెండో కుమార్తె స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరి కాపురం గత ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా సాగింది. ఈ క్రమంలోనే వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు.
అయితే గత కొంత కాలంగా స్వప్నపై ఎల్లారెడ్డికి అనుమానం ఏర్పడింది. తన భార్య ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతను అనుమానించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆ అనుమానం పెరిగి పెద్దదైంది. ఆదివారం సాయంత్రం తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న స్వప్నపై ఎల్లారెడ్డి దాడి చేశాడు. ఐరన్ రాడ్తో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని కోసం గాలిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…