Cucumber : కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. అలా మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడే వాటిల్లో కీరదోస ఒకటి. కీర దోస అనేక పోషకాలను కలిగి ఉంటుంది. రోజూ కీర దోసకాయలను తినడం వల్ల ఎన్నో రకాల జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే కీర దోసను ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తారు. మరి కొందరు వీటిని స్నాక్స్ లా నిత్యం ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కీరదోస ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కీరదోస కాయ శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కీరదోసలో 95 శాతం నీరు ఉంటుంది కాబట్టి శరీరంలో నీటి శాతాన్ని పెంచి డీహైడ్రేషన్ సమస్య తగ్గిస్తుంది. అదే సమయంలో శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడంలో కూడా ఎంతగానో సహకరిస్తుంది. సాధ్యమైనంత వరకు దోసకాయను చెక్కు తీయకుండా తినటం మంచిది. ఎందుకంటే కీరదోస చెక్కులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కీరదోసకాయను చెక్కు తీసుకోకుండా తినటం వలన ఒక రోజులో శరీరానికి అవసరమైన 10 శాతం విటమిన్ సి అందుతుంది.
నీటి శాతం ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో బరువు తగ్గాలని అనుకునే వారికి కీరదోసకాయ ఆహారంగా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. కీరదోసలో పీచు కూడా అధికంగా ఉంటుంది. మలబద్దకంతో బాధ పడేవారు రోజూ కీరదోసను తీసుకోవటం ద్వారా మలబద్దకం సమస్య చాలా సులువుగా అదుపులోకి వస్తుంది. కీరదోసలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరచడంలో ఎంతగానో సహకరిస్తుంది.
కీరదోసలో మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ సి పీచు ఎక్కువగా ఉండటం వలన రక్తపోటులో హెచ్చుతగ్గులను అదుపులో ఉంచుతుంది. కీరదోసలో విటమిన్ ఎ, బి1, బి6, సి, డి, ఫోలేట్, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడే వారు నిత్యం కీరదోసకాయను క్యారెట్ తో కలిపి జ్యూస్ చేసుకోని తాగడం వలన ఎముకలకు బలాన్ని కలిగించి కీళ్ళ నొప్పుల సమస్యను దూరం చేస్తుంది. కనుక కీరదోసన రోజూ తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…