Bolero : వాహనాలను కొనేవారు ఎవరైనా సరే క్యాష్ లేదా డిజిటల్ రూపంలో చెల్లింపులు చేస్తారు. ఒక వేళ ఫైనాన్స్ తీసుకున్నా సరే.. డౌన్ పేమెంట్ను కూడా క్యాష్ లేదా డిజిటల్ రూపంలో చెల్లిస్తారు. ఎక్కువ విలువ గల నోట్లను లేదా డిజిటల్ రూపంలో నగదును ఇచ్చి వాహనాలను కొనుగోలు చేస్తారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏకంగా రూ.12 లక్షలను నాణేల రూపంలో ఇచ్చాడు. దీంతో ఆ నాణేలను లెక్క పెట్టేసరికి షోరూం సిబ్బందికి తలప్రాణం తోకకు వచ్చింది. ఎట్టకేలకు కౌంటింగ్ పూర్తి చేసిన షోరూం సిబ్బంది ఆ వ్యక్తికి కారును ఇచ్చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి మహీంద్రా షోరూంకు వెళ్లి బొలెరో ధర ఎంత ఉందో ఎంక్వయిరీ చేశాడు. ఈ కారు మోడల్ బేసిక్ వేరియెంట్ ధర రూ.8.99 లక్షలకు ప్రారంభమవుతుంది. గరిష్టంగా దీని ధర రూ.12 లక్షలుగా ఉంది. అయితే అతను రూ.12 లక్షల వేరియెంట్ను కొన్నాడు. ఇక పేమెంట్ మొత్తాన్ని నాణేల రూపంలో చెల్లించాడు. దీంతో సిబ్బందికి లెక్క పెట్టడం కష్టమైంది. అయితే చివరకు వారు కౌంటింగ్ పూర్తి చేసి పేపర్ వర్క్ కానిచ్చి.. ఆపై ఆ వాహనాన్ని అతనికి డెలివరీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్గా మారింది.
కాగా బొలెరో వాహనం ప్రస్తుతం బీఎస్6 మోడల్లో లభిస్తోంది. ఇందులో 1.5 లీటర్ల త్రీ సిలిండర్ ఎం-హాక్ డీజిల్ ఇంజిన్ ను ఏర్పాటు చేశారు. ఇది గరిష్టంగా 75 హార్స్ పవర్ను అందిస్తుంది. ప్రస్తుతం బొలెరో వాహనం బి4, బి6, బి6 (ఓ) మోడల్స్లో లభిస్తోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…