Radhe Shyam : ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు త్వరగానే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు అయితే ఓటీటీల్లోకి వచ్చేందుకు కాస్త ఆలస్యం అయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా చాలా త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తోంది మరి. అవును.. ఈ మూవీ మార్చి 11వ తేదీన విడుదలైంది. అనుకున్న ప్రకారం అయితే ఏప్రిల్ 11వ తేదీ తరువాతే ఈ మూవీ ఓటీటీలోకి రావల్సి ఉంటుంది. కానీ 10 రోజుల ముందుగానే అంటే.. ఏప్రిల్ 1వ తేదీనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. కనుక ఈ మూవీ అందులోనే స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాధేశ్యామ్ను తమ ప్లాట్ఫామ్పై స్ట్రీమ్ చేస్తామని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఇక ఇంత త్వరగా ఓ అగ్రహీరో సినిమా ఓటీటీలోకి వస్తుందనే సరికి నిజంగానే నమ్మబుద్ది కావడం లేదు. చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి రాధే శ్యామ్ సినిమా ఫ్లాప్ కాలేదు. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది. అందుకనే మొదటి 3 రోజుల తరువాత కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇక రాధే శ్యామ్ సినిమా ఓటీటీలోకి వస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…