Maheshwari : అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మహేశ్వరి. పెళ్లి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1994వ సంవత్సరంలో అమ్మాయి కాపురం అనే చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో పెళ్లి అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చిన్నప్పటి నుంచి మహేశ్వరికి సినిమాలపై మక్కువ ఉండడంతో ఆమె కాలేజీలో చదివే సమయంలోనే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కొంతకాలం పని చేసింది.
ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా తమిళ్ భాషలో కార్తుతమ్మ అనే చిత్రంలో నటించింది. 2008లో జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాక సినిమాలు చేయడం మానేసింది. మహేశ్వరి హీరోయిన్ గా నటించిన సినిమాల్లో గులాబీ సినిమా ఒకటి. అయితే ఇటీవల మహేశ్వరి ఆలీతో సరదాగా అనే టీవీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా గులాబీ సినిమా విశేషాలు చెబుతూ మేఘాలలో తేలిపొమ్మన్నది పాట షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని చెప్పింది. ఆ పాట షూటింగ్ కు ముందు తానెప్పుడూ బైక్ ఎక్కలేదని చెప్పింది.
అంతేకాదు ఈ సాంగ్ లో బైక్ పై చాలా వేగంగా వెళ్లాలని జేడీ చక్రవర్తితో దర్శకుడు కృష్ణవంశీ చెప్పారని తెలిపింది. దాంతో తనకు మరింత భయం పెరిగిందని జేడీ చాలా స్పీడ్ గా బైక్ నడిపాడని పేర్కొంది. దీంతో పాట షూటింగ్ చేసిన సందర్భంలో బైక్ స్కిడ్ అయిందని మహేశ్వరి తెలిపింది. దాంతో బైక్ ఒక్కసారి కాలువలోకి వెళ్లి పడిపోయిందని కాసేపు తనకు ఏమీ అర్థం కాలేదని, అయితే అందులో ఒక చెట్టు ఉండడం వల్ల బతికి బయటపడ్డామని చెప్పుకొచ్చింది. అక్కడే ఉన్న వాళ్ళు బైక్ ను వెనక్కి లాగారని అలా ప్రమాదం నుండి బయటపడ్డామని తెలిపింది. గులాబీ సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…