Karthikeya 2 : నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటించిన కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందూ మొండేటి డైరెక్షన్లో 2014లో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత కార్తికేయ 2 వస్తుందని ప్రకటన రాగానే అందరిలో కొద్దిపాటి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కార్తికేయ 2 చిత్రం అంచనాలకు మించి దేశవ్యాప్తంగా దూసుకుపోతూ నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. దేశవ్యాప్తంగా కార్తికేయ 2 కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.
ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించలేము అనే నమ్మకంతో ఉన్న దర్శక నిర్మాతల అభిప్రాయం తప్పు అనే విషయాన్ని కార్తికేయ 2 చిత్రం ప్రూవ్ చేసింది. కంటెంట్ బాగుంటే ఏ బాష అయినా సరే సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆరాధిస్తారు అని చెప్పడానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలిచింది. కేవలం 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ 60 కోట్ల రూపాయిల వరుకు షేర్స్ ని రాబట్టింది. హిందీ లో అయితే కేవలం 60 షోలతో ప్రారంభం అయ్యి మొదటి రోజు కేవలం 2 లక్షల రూపాయిలు మాత్రమే నెట్ వసూళ్లు చేసింది. కానీ ప్రేక్షకులలో మంచి పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు నుండి కలెక్షన్స్ పెరుగుతూ పోయాయి. అలా రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతూ కార్తికేయ 2 హిందీ లో ఏకంగా 35 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వచ్చే 4వ తేదీన OTT లో విడుదల కాబోతున్న సందర్బంగా థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయ్యింది.
ప్రాంతాల వారీగా ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే.. ఒక్క నైజం ప్రాంతంలోనే ఈ సినిమా దాదాపుగా 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ ను వసూళ్లు చేసింది. రాయలసీమ రూ.5 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 4.50 కోట్లు. గోదావరి జిల్లాలు రెండు కలుపుకొని రూ. 4 కోట్లు. గుంటూరు రూ.2.80 కోట్లు. కృష్ణ రూ. 2.30 కోట్లు. నెల్లూరు 1.10 కోట్ల రూపాయల వసూళ్ళని రాబట్టి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల రూపాయిల షేర్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం కర్ణాటక లో 3 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. ఇక హిందీ వెర్షన్ లో 16 కోట్ల రూపాయిల షేర్ ను రాబట్టింది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 60 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టుకుందని ట్రేడ్ వర్గాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…