Maheshwari : ఒకప్పుడు హీరోయిన్ మహేశ్వరి నటిగా ఎంతటి పేరును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అప్పట్లో నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఓ దశలో టాప్ రేంజ్కు కూడా చేరుకుంది. అయితే అందరు హీరోయిన్లలాగే ఈమె కూడా కొంతకాలానికి తెరమరుగు అయిపోయింది. ఇక తాజాగా ఈమె మరోమారు తెరపై కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఒకప్పుడు ఎంతో గ్లామర్గా ఉన్న మహేశ్వరి ఇప్పుడు మాత్రం బాగా లావుగా అయి దర్శనమిస్తోంది. అయితే తాజాగా అలీతో షోలో పాల్గొన్న మహేశ్వరి తన సినీ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికరమైన సంఘటనల గురించి తెలియజేసింది.
అప్పట్లో జేడీ చక్రవర్తి హీరోగా, మహేశ్వరి హీరోయిన్గా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన దెయ్యం మూవీ ఎంతటి హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి మహేశ్వరి తెలియజేసింది.
అప్పట్లో దెయ్యం మూవీ షూటింగ్ మేడ్చల్లోని ఓ పాడుబడిన బిల్డింగ్లో జరిగింది. షూటింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా శ్మశానం సెట్ వేశారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకు సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. షూటింగ్ రాత్రి 1 గంటకు జరుగుతోంది.
అయితే షూటింగ్ లొకేషన్ నుంచి 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి మెయిన్ రోడ్డుకు చేరుకుని తిరిగి వెనక్కి రావాలి. ఇదీ పందెం. అలా వెళ్లి వచ్చిన వారికి రూ.50వేలు ఇస్తానని వర్మ చెప్పారు. ఈ క్రమంలో చాలెంజ్ స్వీకరించిన మహేశ్వరి భయపడుతూనే అలా వెళ్లి వచ్చిందట. అయినప్పటికీ వర్మ తాను చెప్పినట్లు రూ.50వేలు ఇవ్వలేదట. ఇదే విషయాన్ని ఆమె తాజాగా చెబుతూ వర్మ అలా తనను మోసం చేశారని చెప్పుకొచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…