Maheshwari : ఒకప్పుడు హీరోయిన్ మహేశ్వరి నటిగా ఎంతటి పేరును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అప్పట్లో నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఓ దశలో టాప్ రేంజ్కు కూడా చేరుకుంది. అయితే అందరు హీరోయిన్లలాగే ఈమె కూడా కొంతకాలానికి తెరమరుగు అయిపోయింది. ఇక తాజాగా ఈమె మరోమారు తెరపై కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఒకప్పుడు ఎంతో గ్లామర్గా ఉన్న మహేశ్వరి ఇప్పుడు మాత్రం బాగా లావుగా అయి దర్శనమిస్తోంది. అయితే తాజాగా అలీతో షోలో పాల్గొన్న మహేశ్వరి తన సినీ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికరమైన సంఘటనల గురించి తెలియజేసింది.
అప్పట్లో జేడీ చక్రవర్తి హీరోగా, మహేశ్వరి హీరోయిన్గా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన దెయ్యం మూవీ ఎంతటి హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి మహేశ్వరి తెలియజేసింది.
అప్పట్లో దెయ్యం మూవీ షూటింగ్ మేడ్చల్లోని ఓ పాడుబడిన బిల్డింగ్లో జరిగింది. షూటింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా శ్మశానం సెట్ వేశారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకు సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. షూటింగ్ రాత్రి 1 గంటకు జరుగుతోంది.
అయితే షూటింగ్ లొకేషన్ నుంచి 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి మెయిన్ రోడ్డుకు చేరుకుని తిరిగి వెనక్కి రావాలి. ఇదీ పందెం. అలా వెళ్లి వచ్చిన వారికి రూ.50వేలు ఇస్తానని వర్మ చెప్పారు. ఈ క్రమంలో చాలెంజ్ స్వీకరించిన మహేశ్వరి భయపడుతూనే అలా వెళ్లి వచ్చిందట. అయినప్పటికీ వర్మ తాను చెప్పినట్లు రూ.50వేలు ఇవ్వలేదట. ఇదే విషయాన్ని ఆమె తాజాగా చెబుతూ వర్మ అలా తనను మోసం చేశారని చెప్పుకొచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…