Mahesh Babu : ఇటీవలి కాలంలో అభిమానులు.. హీరోలు, నిర్మాతలతోపాటు యూనిట్పై తెగ ఫైర్ అవుతున్నారు. తాజాగా సర్కారు వారి పాట చిత్ర బృందంపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపించడంతో మహేష్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసేసే పనిలో ఉన్నారని టాక్.
సర్కారు వారి పాట సినిమా మే 12 కే విడుదలకానుందని అంటున్నారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ సంగీతం అందించారు. ఈ పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది.
ఇక ఈ సినిమా నుండి విడుదలైన మరో సాంగ్.. పెన్నీ సాంగ్. ఈ పాట సూపర్ స్టైలిష్గా ఉంటూ.. ఇన్స్టాంట్ హిట్గా నిలిచింది. ఈ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా.. అనంత శ్రీరామ్ రాశారు. ఇక మూడో పాటకు రంగం సిద్ధం అయ్యింది. అయితే ప్రమోషన్స్ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో సర్కారు వారి పాట నిర్మాతల్లో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ ఏకిపారేస్తున్నారు. రిలీజ్కి నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఆశించిన మేర సర్కారు వారి పాట ప్రమోషన్స్ లేవని, వరుస అప్డేట్స్ కావాలనేది మహేష్ ఫ్యాన్స్ డిమాండ్. ఈ క్రమంలో అప్డేట్స్ సరిగా ఇవ్వడం లేదంటూ నిర్మాతలను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. #WorstTeamSVP అనే నెగెటివ్ ట్యాగ్ ను ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇది చూసైనా మేకర్స్ అప్డేట్ ను విడుదల చేస్తారో.. లేదో.. చూడాలి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…