Mahesh Babu : ఇటీవలి కాలంలో అభిమానులు.. హీరోలు, నిర్మాతలతోపాటు యూనిట్పై తెగ ఫైర్ అవుతున్నారు. తాజాగా సర్కారు వారి పాట చిత్ర బృందంపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపించడంతో మహేష్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసేసే పనిలో ఉన్నారని టాక్.
సర్కారు వారి పాట సినిమా మే 12 కే విడుదలకానుందని అంటున్నారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ సంగీతం అందించారు. ఈ పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది.
ఇక ఈ సినిమా నుండి విడుదలైన మరో సాంగ్.. పెన్నీ సాంగ్. ఈ పాట సూపర్ స్టైలిష్గా ఉంటూ.. ఇన్స్టాంట్ హిట్గా నిలిచింది. ఈ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా.. అనంత శ్రీరామ్ రాశారు. ఇక మూడో పాటకు రంగం సిద్ధం అయ్యింది. అయితే ప్రమోషన్స్ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో సర్కారు వారి పాట నిర్మాతల్లో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ ఏకిపారేస్తున్నారు. రిలీజ్కి నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఆశించిన మేర సర్కారు వారి పాట ప్రమోషన్స్ లేవని, వరుస అప్డేట్స్ కావాలనేది మహేష్ ఫ్యాన్స్ డిమాండ్. ఈ క్రమంలో అప్డేట్స్ సరిగా ఇవ్వడం లేదంటూ నిర్మాతలను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. #WorstTeamSVP అనే నెగెటివ్ ట్యాగ్ ను ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇది చూసైనా మేకర్స్ అప్డేట్ ను విడుదల చేస్తారో.. లేదో.. చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…