Hyper Aadi : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ షోతో చాలా మంది కమెడియన్స్ పాపులర్ కాగా వారిలో హైపర్ ఆది ఒకరు. తనదైన పంచ్లతో అలరిస్తున్న హైపర్ ఆది ఇప్పుడు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం నాగబాబు జబర్దస్త్ ని వదిలేయగా, రీసెంట్గా రోజా గుడ్ బై చెప్పింది. ఇక ఇప్పుడు హైపర్ ఆది కూడా వీడనున్నట్టు సమాచారం.
జబర్దస్త్ జడ్జిగా చేసి రోజా మరింత ఫేమ్ అయ్యారు. ఇదివరకు నాగబాబు కూడా చేసేవారు. కానీ ఆయన మరో చానల్లోకి వెళ్లారు. అయితే ఇటీవల రోజా మంత్రిగా నియమితులయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇతర కార్యక్రమాలు చేసే వీలులేకుండా పోయింది. ఇదివరకు ఎమ్మెల్యేగా అయితే సమయం ఉండేది. కానీ మంత్రి కావడంతో టైమ్ లేదు. దీంతో జబర్దస్త్ టీమ్ ఆర్కే రోజాకు ఘనంగా వీడ్కోలు పలికింది. మాట్లాడుతూనే రోజా కంట తడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈది హార్ట్ టచింగ్గా అనిపించింది.
ఇక ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ నుంచి గ్యాప్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ టెంపరరీ మాత్రమేనా లేక శాశ్వతంగా ఈ షోకి దూరం అవుతున్నాడా.. అనేది తెలియాల్సి ఉంది. హైపర్ ఆది జబర్దస్త్ షో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలలో కనిపిస్తున్నాడు. ఆది రీసెంట్ గా భీమ్లా నాయక్ చిత్రంలో మెరిశాడు. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ షో చేస్తూనే.. అవకాశం వచ్చిన చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. జబర్దస్త్ షోలో హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. కానీ ఆది అవేమి పట్టించుకోలేదు. అయితే ఒకరి తరువాత ఒకరు జబర్దస్త్కు గుడ్ బై చెబుతుండడం అందరినీ షాక్కు గురిచేస్తోంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…