సాధారణంగా ఈ రోజుల్లో ఎవరైనా అగ్ర హీరో సినిమా విడుదలైందంటే చాలు, థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు, తమ అభిమాన హీరోకి భారీ స్థాయిలో కట్ అవుట్లు ఏర్పాటు చేయడం, దండలు వేయడం పాలాభిషేకాలు.. ఇలాంటివి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొన్ని సందర్భాల్లో అభిమానులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల థియేటర్ యజమానులు ఎంతో నష్టాన్ని భరించవలసి వస్తోంది. ఇలాంటి సంఘటనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ థియేటర్లో చోటు చేసుకుంది.
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని థియేటర్లలో భారీ ఎత్తున ప్రదర్శించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ఈ మూవీ ఘన విజయాన్ని సాధించింది. కాగా ఇంత వరకు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మూవీని ఇంత భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయలేదు. ఇదే మొదటి సారి అని చెబుతున్నారు.
అయితే కొందరు అభిమానులు అత్యుత్సాహంతో ఓ థియేటర్ లో సినిమా తెర వద్దకు వెళ్లి దాన్ని చించేశారు. దీంతో థియేటర్ యజమానికి నష్టం కాస్త ఎక్కువగానే వచ్చిందని అంటున్నారు. చిరిగిపోయన తెరను మార్చడానికి కనీసం రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇక అభిమానుల సంతోషం కోసం సినిమాను ప్రదర్శించినపుడు వాళ్లు ఇలా చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని అంటున్నారు.
ఇలా చేయడం అనేది ఒక పనికిమాలిన చర్యగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాబోయే సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ జన్మదినం కావడంతో ఇదే విధంగా ఆయన నటించిన జల్సా సినిమాని కూడా పెద్ద స్థాయిలో రీ రిలీజ్ చేయాలని పవన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. మరి ఆ రోజు ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…