Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ శీతల పానీయం థమ్స్ అప్కు ఎంతో కాలంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం విదితమే. గత దశాబ్ద కాలం నుంచి ఆయన ఆ కూల్ డ్రింక్ను ప్రమోట్ చేస్తున్నారు. థమ్స్ అప్కు చెందిన ఎన్నో యాడ్స్లో ఇప్పటికే మహేష్ నటించారు. అయితే ఎట్టకేలకు ఆ సంస్థతో మహేష్ తెగదెంపులు చేసుకున్నారు.
థమ్స్ అప్ మాతృ సంస్థ అయిన కోకాకోలాతో గతంలో మహేష్ ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ కోకాకోలాతో అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నారు. అయితే వెంటనే ఆయన పెప్సీ కో. తో డీల్ కుదుర్చుకోవడం విశేషం. ఈ క్రమంలోనే మహేష్ ఇకపై పెప్సీ కో. కు చెందిన మౌంటెయిన్ డ్యూ అనే శీతల పానీయానికి ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.
మహేష్ ఇటీవలే అమెరికాకు వెళ్లగా.. అంతకు ముందే ఈ డీల్ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వివరాలను అధికారికంగా ప్రకటించారు. దీంతో థమ్స్ అప్కు ఇకపై మహేష్ కనిపించరు. మౌంటెయిన్ డ్యూ యాడ్లో మహేష్ కనిపించనున్నారు. ఆ యాడ్ ఎలా ఉంటుందోనని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక థమ్స్ అప్ విషయానికి వస్తే ఆ సంస్థ తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పాపులర్ యూత్ హీరోను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు ఆ చాన్స్ వస్తుందని అంటున్నారు.
కాగా విజయ్ ప్రస్తుతం లైగర్ చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 25న ఈ మూవీ విడుదల కానుంది. మరోవైపు మహేష్ తన తదుపరి చిత్రం సర్కారు వారి పాటలో కనిపించనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. తరువాత త్రివిక్రమ్తో సినిమా చేయనున్నాడు. అనంతరం రాజమౌళితో సినిమాను ప్రారంభిస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…