Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాజమౌళి త్వరలో మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాను రాజమౌళి దాదాపుగా రూ.800 కోట్లతో భారీగా రూపొందించనున్నారట. ఈ సినిమా అడ్వెంచర్ డ్రామా అని, RRR, బాహుబలి కంటే పెద్దదిగా ఉండబోతోందని టాక్స్ వినిపించాయి. అయితే ఈ విషయాలపై రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.
మహేష్ – రాజమౌళి సినిమా రూ.800 కోట్ల బడ్జెట్తో నిర్మించబడుతుందనే పుకార్లలో నిజం ఉందా.. అని విజయేంద్ర ప్రసాద్ను అడగగా, విజయేంద్ర ప్రసాద్ కాస్త వెటకారంగా నవ్వుతూ కొట్టి పారేశారు. కథ లేకుండా రూ.800కోట్ల బడ్జెట్ ఎక్కడిది అని ప్రశ్నించారు. ఈ ఏడాది చివరికల్లా రాజమౌళి కథను ఖరారు చేసి, ఈ క్యాలెండర్ ఇయర్లో సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. జంగిల్ అడ్వెంచర్ చిత్రంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి, కె విజయేంద్ర ప్రసాద్లు ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహేష్ సరసన హిందీ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి RRRలో సీత పాత్రలో నటించిన ఆలియా భట్ మరోసారి రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా నటించనుందని అంటున్నారు. ఆ మేరకు ఆలియా భట్తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారట. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…