Macherla Niyojakavargam : మాచర్ల నియోజకవర్గం చిత్రంతో ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్స్ గా కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటించారు. మాచర్ల నియోజకవర్గం చిత్రం ద్వారా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెలుగు తెరకు పరిచయమయ్యారు. రాను రానంటూనే చిన్నదో పాటలో అంజలి గెస్ట్ రోల్ లో ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము లేపింది. ప్రేక్షకుల్లో ఈ పాటకు వచ్చినంత ఆదరణ చిత్రానికి రాలేదనే చెప్పవచ్చు. మాచర్ల నియోజకవర్గం మొదటిరోజు ఫస్ట్ షోకే ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ ను మూటగట్టుకుంది. గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నితిన్ కి ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. సినిమా పక్కా రొటీన్ గా ఉంది అంటూ నెగెటివ్ కామెంట్స్ వినబడడంతో రివ్యూలు కూడా దారుణంగా వచ్చిపడ్డాయి.
విడుదల కాక ముందు నుంచి మాచర్ల నియోజకవర్గం వివాదాల్లో ఇరుక్కుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ రెండు కులాలను అవమానించే విధంగా ఉంది అంటూ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇదంతా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అంటూ దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కూడా సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రం నెగెటివ్ టాక్ మూటగట్టుకుని డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో త్వరలో ఓటీటీలో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం హక్కులను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న అమెజాన్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో వస్తుండడంతో అందరూ షాకవుతున్నారు. ఇక ఓటీటీలో అయినా సక్సెస్ అవుతుందో.. లేదో.. చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…