NTR : ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రజా ప్రతినిధులు తనను అవమానించారని.. తన భార్యపై దారుణంగా వ్యాఖ్యలు చేశారని.. ఆరోపిస్తూ.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. శుక్రవారం ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, సినీ సెలబ్రిటీలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
అసెంబ్లీలో తాను చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదని మరోవైపు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. చంద్రబాబు ఏడవడం ఎన్టీఆర్కు మైనస్ అయిందని అంటున్నారు.
టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ అసమర్థుడని, ఆయనకు ఏమీ తెలియదని.. కనుక పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని ఒక వర్గం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ను టార్గెట్గా చేసిన కొందరు లోకేష్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ను విమర్శిస్తున్నారు.
పార్టీ కష్టాల్లో ఉన్నా, సాక్షాత్తూ పార్టీ అధినేతకు ఇంతటి అవమానం జరిగి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నా.. ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదు, పార్టీ అంటే పట్టదా ? ఇలాంటి వారికి పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారు ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ను లోకేష్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మింగుడు పడడం లేదని అంటున్నారు.
ఎన్టీఆర్ను టార్గెట్ చేయడం కోసమే ఈ విధంగా లోకేష్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో వైఎస్ హయాంలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. తరువాత ఆయన మళ్లీ రాజకీయాల్లో కనిపించలేదు. ఈ క్రమంలోనే టీడీపీ పగ్గాలు ఇప్పటికైనా ఎన్టీఆర్ చేపట్టాలని.. లేదంటే పార్టీకి భవిష్యత్తు అనేది ఉండదని.. టీడీపీలో చాలా మంది ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది గిట్టని లోకేష్ అభిమానులు.. తాజాగా జరిగిన ఘటనను ఆసరగా తీసుకుని ఈ విధంగా ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…