NTR : ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రజా ప్రతినిధులు తనను అవమానించారని.. తన భార్యపై దారుణంగా వ్యాఖ్యలు చేశారని.. ఆరోపిస్తూ.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. శుక్రవారం ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, సినీ సెలబ్రిటీలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
అసెంబ్లీలో తాను చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదని మరోవైపు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. చంద్రబాబు ఏడవడం ఎన్టీఆర్కు మైనస్ అయిందని అంటున్నారు.
టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ అసమర్థుడని, ఆయనకు ఏమీ తెలియదని.. కనుక పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని ఒక వర్గం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ను టార్గెట్గా చేసిన కొందరు లోకేష్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ను విమర్శిస్తున్నారు.
పార్టీ కష్టాల్లో ఉన్నా, సాక్షాత్తూ పార్టీ అధినేతకు ఇంతటి అవమానం జరిగి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నా.. ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదు, పార్టీ అంటే పట్టదా ? ఇలాంటి వారికి పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారు ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ను లోకేష్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మింగుడు పడడం లేదని అంటున్నారు.
ఎన్టీఆర్ను టార్గెట్ చేయడం కోసమే ఈ విధంగా లోకేష్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో వైఎస్ హయాంలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. తరువాత ఆయన మళ్లీ రాజకీయాల్లో కనిపించలేదు. ఈ క్రమంలోనే టీడీపీ పగ్గాలు ఇప్పటికైనా ఎన్టీఆర్ చేపట్టాలని.. లేదంటే పార్టీకి భవిష్యత్తు అనేది ఉండదని.. టీడీపీలో చాలా మంది ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది గిట్టని లోకేష్ అభిమానులు.. తాజాగా జరిగిన ఘటనను ఆసరగా తీసుకుని ఈ విధంగా ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…