NTR : ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రజా ప్రతినిధులు తనను అవమానించారని.. తన భార్యపై దారుణంగా వ్యాఖ్యలు చేశారని.. ఆరోపిస్తూ.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. శుక్రవారం ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, సినీ సెలబ్రిటీలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
అసెంబ్లీలో తాను చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదని మరోవైపు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. చంద్రబాబు ఏడవడం ఎన్టీఆర్కు మైనస్ అయిందని అంటున్నారు.
టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ అసమర్థుడని, ఆయనకు ఏమీ తెలియదని.. కనుక పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని ఒక వర్గం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ను టార్గెట్గా చేసిన కొందరు లోకేష్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ను విమర్శిస్తున్నారు.
పార్టీ కష్టాల్లో ఉన్నా, సాక్షాత్తూ పార్టీ అధినేతకు ఇంతటి అవమానం జరిగి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నా.. ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదు, పార్టీ అంటే పట్టదా ? ఇలాంటి వారికి పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారు ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ను లోకేష్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మింగుడు పడడం లేదని అంటున్నారు.
ఎన్టీఆర్ను టార్గెట్ చేయడం కోసమే ఈ విధంగా లోకేష్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో వైఎస్ హయాంలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. తరువాత ఆయన మళ్లీ రాజకీయాల్లో కనిపించలేదు. ఈ క్రమంలోనే టీడీపీ పగ్గాలు ఇప్పటికైనా ఎన్టీఆర్ చేపట్టాలని.. లేదంటే పార్టీకి భవిష్యత్తు అనేది ఉండదని.. టీడీపీలో చాలా మంది ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది గిట్టని లోకేష్ అభిమానులు.. తాజాగా జరిగిన ఘటనను ఆసరగా తీసుకుని ఈ విధంగా ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…