Naga Chaitanya : ఎంతో అన్యోన్యంగా ఉండే సమంత-చైతూలు అక్టోబర్ 2న విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సమంత -చైతూ విడాకులు చాలా మందిని ఇబ్బంది పెట్టాయి. ఈ ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న ఇమేజ్ రీత్యా విడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోయారు. కారణం ఏదైనా కానీ, సర్దుకుపోయి, కలసి ఉంటే బాగుండేదని భావించారు. సమంత-చైతూలని అభిమానులు విడివిడిగా అస్సలు చూడలేకపోతున్నారు.
ప్రస్తుతం సమంత- నాగ చైతన్య తమ జ్ఞాపకాలను మెదడు నుండి చెరిపివేసే ప్రయత్నంలో ఉన్నారు. దాని కోసం ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ తో విహార, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది. సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో గోవా, డెహ్రాడూన్, చార్ ధామ్ యాత్ర చేసింది. అనంతరం దుబాయ్ టూర్ కి వెళ్లడం జరిగింది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. విడాకుల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి సమంత తన భావాలను వ్యక్తపరిచేలా రకరకాల కొటేషన్స్ ను పోస్ట్ చేస్తూ వస్తోంది.
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండని నాగచైతన్య మాత్రం ఎలాంటి పోస్ట్లు పెట్టడం లేదు. కానీ తాజాగా ఆయన చేసిన పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. మాథ్యూ మాక్కోనాగై అనే రచయిత రాసిన బుక్ను పూర్తి చేశాడు చై. ఈ విషయాన్ని ఇన్స్టావేదికగా షేర్ చేసిన నాగచైతన్య.. ‘జీవితానికి ఇదొక ప్రేమలేఖ.. మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు మాథ్యూకి కృతజ్ఞతలు.
ఈ పుస్తకం నా జీవితానికి ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది. నాగచైతన్య చేసిన ఈ పోస్ట్కి వెనుక పరమార్ధాలు ఏమైనా ఉన్నాయా.. అని ఆలోచిస్తున్నారు అభిమానులు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…