Liger Movie : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఆగస్ట్ 25న థియేటర్లలోకి రావడం.. వచ్చిన రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం జరిగిపోయాయి. అయితే సినిమా విడుదలకు ముందు.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఛార్మీ కౌర్.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. విజయ్, పూరీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమా నిర్మాణ సమయంలో మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఒక్క రూపాయి కూడా లేదు. ఆ సమయంలో మాకు ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చింది. కానీ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆ డీల్ని కాదనుకున్నాం.
అందుకు పూరీ గారికి ఎన్ని గట్స్ కావాలి అంటూ చార్మీ విషయాన్ని రివీల్ చేసింది. ఈ విషయం చెబుతూ ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇప్పుడిదే విషయాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీమర్స్ మాత్రం మీమ్స్ తో తెగ సందడి చేస్తున్నారు. ఇంత గొప్ప సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందో ? అంటూ ఛార్మిని, పూరీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ఇప్పుడున్న టాక్ ప్రకారం ఈ సినిమా రూ.50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టమే. మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో ఓటీటీ డీల్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సినిమాపై ఉన్న నమ్మకంతో పూరి, ఛార్మీ అండ్ టీమ్ చేజేతులా రూ. 200 కోట్లు మిస్ చేసుకున్నారు. ఇక విజయ్ అయితే సినిమా వసూళ్లు రూ.200 కోట్ల నుండి లెక్కెడతా అని సినిమాకు ఓవర్ హైప్ ఇచ్చాడు. అంటే రూ.200 కోట్లకుపైగా సినిమా వసూళ్లు ఉంటాయి అని చెప్పాడు. దీంతో ఇప్పుడు ఎక్కడి నుంచి లెక్కపెడతారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…