Krithi Shetty : సినీ ప్రపంచంలో ఒకసారి అడుగు పెట్టిన తర్వాత హీరోయిన్స్ ఒక చిత్రం సక్సెస్ అయ్యిందంటే చాలు, సినిమాలతో బిజీగా ఉంటూ మిగతా ప్రపంచాన్ని మర్చిపోతారు. వరుసలతో ఆఫర్స్ తో దూసుకుపోతున్న టైంలో ఒక్క ఫ్లాప్ పడితే చాలు దిమ్మతిరిగి దేవుడు గుర్తుకొస్తాడు. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కి దేవుడిపై భక్తి పెరిగినట్లు ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా మటుకు సక్సెస్ కన్నా ఫ్లాపులే సంపాదించుకున్నాయి.
ఇప్పుడు ఇదే భయం కన్నడ బ్యూటీ కృతి శెట్టికి కూడా మొదలైనట్లు ఉంది. మొదటి చిత్రమైన ఉప్పెనతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో సక్సస్ ను అందుకొని హ్యాట్రిక్ హిరోయిన్ గా ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ అంటూ మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ బ్యూటీకి గత కొన్ని రోజులుగా బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది.
ఇటీవల విడుదలైన రామ్ పోతినేనితో నటించిన ది వారియర్, నితిన్ తో నటించిన మాచర్ల నియోజకవర్గం రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో కృతి శెట్టి గుడులు గోపురాలు అంటూ పూజలు చేస్తూ తిరుగుతోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి తన నెక్స్ట్ సినిమా సక్సెస్ కావాలని గుడిలో ప్రత్యేకంగా పూజలు చేయించిందట. ఇప్పుడు ఈ విషయమే కన్నడ మీడియాలో వైరల్ గా మారింది. తన నెక్స్ట్ చిత్రం హిట్ అయితే దేవుడికి వెండి కిరీటం చేయిస్తానని భారీగా మొక్కులు కూడా మొక్కిందంట కృతి. మరి దేవుడు ఆమె కోరికను విన్నాడో లేదో అనేది నెక్స్ట్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. ఈ వార్తతో సినీ విశ్లేషకులు కృతికి తన కెరీర్ పై భయం పట్టుకుందని మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…