Prabhas : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన సంతాప సభను సొంత ఊరు మొగల్తూరులో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభాస్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోపాటు ప్రభాస్ కూడా అక్కడికి వెళ్లాడు. ప్రభాస్ సన్నిహితులు వారం రోజుల ముందు నుండే అక్కడ ఏర్పాట్లను ప్రారంభించారు. లక్ష మందికి పైగా హాజరయ్యేలా ప్రచారం చేశారు. అయితే లక్ష 20 వేల మందికి సరిపోయే ఆహార పదార్థాలను వడ్డించాలని ముందుగా ప్లాన్ చేశారు. అందుకోసం బడ్జెట్ 3 కోట్ల రూపాయలను కేటాయించారు.
ఈ రూ.3 కోట్లను ప్రభాస్ తన ఖాతా నుండి ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల ఆస్తి కృష్ణంరాజు ఫ్యామిలీ సొంతం, అయినా కూడా పెదనాన్నపై ఉన్న అభిమానంతో ప్రభాస్ 3 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడంట. ప్రభాస్ 3, 4 రోజుల నుండి స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నాడని సంతాప సభ ఏర్పాట్లు చేసిన వారంటున్నారు. ఈ సంతాప సభలో పెట్టిన భోజనం మెనూ గురించి కొన్ని సంవత్సరాల వరకు అభిమానులు మరిచిపోలేని రేంజ్ లో ఉందట. ఇంతకు భోజనంలో ఏం వడ్డించారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
ఐటమ్స్ వివరాల్లోకి వెళితే.. 6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల మటన్ బిర్యానీ, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు, 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలు ఉన్నాయి. జాబితా చూస్తుంటే కాస్త ఖర్చైనా మొగల్తూరు వెళ్లి రెబల్ స్టార్ ఇంట భోజనం చేస్తే బాగుండేది అనిపిస్తుంది కదా.. ఇది తెలిసిన నెటిజన్లు ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాజు ఎక్కడున్నా రాజే అంటూ అభినందిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…