Krishnam Raju Last Wish : చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో నిండిపోయింది. గత కొంతకాలంగా వరుస విషాదాలతో నిండిపోతున్న సినీ ఇండస్ట్రీకి కొద్దిసేపటి క్రితమే ఉలిక్కిపడే వార్త వినిపిచింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు షాక్ లో ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెలవారుజామున 3.25 గంటలకు ఆయన కన్నుమూశారు. ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఆయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. మొదట్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 170కి పైగా చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
కొంతకాలంగా డయాబెటిస్, కరోనరీ హార్ట్ డీసీజ్ తోపాటు దీర్ఘ కాలిక కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న కృష్ణంరాజు ఇలా సడెన్ గా మరణించడంతో సినీ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ వార్తతో రెబల్ అభిమానులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రస్తుతం రెబల్ స్టార్ కృష్ణంరాజు జీవితంలో మిగిలి ఉన్న ఏకైక కోరిక తీరకుండానే చనిపోయారంటూ ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణంరాజు సినీ వారసుడిగా ప్రభాస్ ని చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేనప్పటి నుంచి ప్రభాస్ కి వివాహం చేయాలని బాగా ట్రై చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ పెళ్లి చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ రావడంతో, చివరికి ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించడంతో ప్రభాస్ పెళ్లి చూడకుండానే, చివరి కోరిక తీరకుండానే కృష్ణంరాజు చనిపోయారు. ప్రభాస్ పెళ్లి విషయంపై ఈ వార్తలు ప్రచారం కావడంతో రెబల్ స్టార్ అభిమానులు మరింతగా బాధపడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…