Krishnam Raju Last Wish : చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో నిండిపోయింది. గత కొంతకాలంగా వరుస విషాదాలతో నిండిపోతున్న సినీ ఇండస్ట్రీకి కొద్దిసేపటి క్రితమే ఉలిక్కిపడే వార్త వినిపిచింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు షాక్ లో ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెలవారుజామున 3.25 గంటలకు ఆయన కన్నుమూశారు. ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఆయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. మొదట్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 170కి పైగా చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
కొంతకాలంగా డయాబెటిస్, కరోనరీ హార్ట్ డీసీజ్ తోపాటు దీర్ఘ కాలిక కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న కృష్ణంరాజు ఇలా సడెన్ గా మరణించడంతో సినీ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ వార్తతో రెబల్ అభిమానులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రస్తుతం రెబల్ స్టార్ కృష్ణంరాజు జీవితంలో మిగిలి ఉన్న ఏకైక కోరిక తీరకుండానే చనిపోయారంటూ ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణంరాజు సినీ వారసుడిగా ప్రభాస్ ని చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేనప్పటి నుంచి ప్రభాస్ కి వివాహం చేయాలని బాగా ట్రై చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ పెళ్లి చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ రావడంతో, చివరికి ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించడంతో ప్రభాస్ పెళ్లి చూడకుండానే, చివరి కోరిక తీరకుండానే కృష్ణంరాజు చనిపోయారు. ప్రభాస్ పెళ్లి విషయంపై ఈ వార్తలు ప్రచారం కావడంతో రెబల్ స్టార్ అభిమానులు మరింతగా బాధపడుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…