ED దాడుల్లో ప‌ట్టుబ‌డే డ‌బ్బును ఏం చేస్తారో తెలుసా..?

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అనేక చోట్ల ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్) దాడులు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. అనేక చోట్ల కోటానుకోట్ల న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట ప‌డుతోంది. రూ.500, రూ.2వేల నోట్ల క‌ట్ట‌లు గుట్ట‌లు గుట్ట‌లుగా ల‌భిస్తున్నాయి. చాలా మంది మోసం చేసి లేదా నేరాలు చేసి న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌కేస్తున్నారు. అలాంటి డ‌బ్బు మొత్తం ED దాడుల్లో ప‌ట్టుబ‌డుతోంది. ఈ మ‌ధ్యే కోల్‌క‌తాకు చెందిన ఓ వ్యాపార‌వేత్త ఇంట్లో ED దాడులు చేసి రూ.17 కోట్ల న‌ల్ల‌ధ‌నాన్ని స్వాధీనం చేసుకుంది.

ఇక ఇటీవ‌లే బెంగాల్ మంద్రి ఇంట్లో రూ.27 కోట్ల న‌ల్ల‌ధ‌నం, బంగారు ఆభ‌ర‌ణాలు ల‌భించాయి. వాట‌న్నింటినీ ED అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేర‌కు కేసులు కూడా న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ED దాడుల్లో ల‌భించిన మొత్తం రూ.1 ల‌క్ష కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఇలా దాడుల్లో ప‌ట్టుబ‌డిన న‌ల్ల‌ధ‌నం లేదా బంగారం వంటి వాటిని ఏం చేస్తారు ? అనే ప్ర‌శ్న చాలా మందికి ఉత్ప‌న్నం అవుతుంటుంది. అయితే అలాంటి డ‌బ్బును లేదా విలువైన వ‌స్తువుల‌ను ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ED

దేశంలో ఎక్క‌డైనా స‌రే మ‌నీ లాండ‌రింగ్ లేదా న‌ల్ల‌ధ‌నం దాచి ఉంచార‌ని, నేరం చేశార‌ని, అక్ర‌మంగా ధ‌నం, విలువైన వ‌స్తువుల‌ను క‌లిగి ఉన్నార‌ని స‌మాచారం అందితే.. ఈడీ లేదా సీబీఐ లేదా ఐటీ శాఖ అధికారులు దాడులు చేయ‌వ‌చ్చు. ఇక ఆ దాడుల్లో ప‌ట్టుబ‌డిన డ‌బ్బును లేదా ఆభ‌ర‌ణాల వంటి విలువైన వ‌స్తువుల‌ను సీజ్ చేస్తారు. ఆ డ‌బ్బు, వ‌స్తువులు అన్నీ సంబంధిత శాఖ ఆధీనంలో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తారు. ఆ వివ‌రాల‌ను కోర్టులో అంద‌జేస్తారు.

అయితే కేసు విచార‌ణ జ‌రిగి నిందితులు దోషులు అని తేలితే.. వారి నుంచి అంత‌కు ముందు స్వాధీనం చేసుకున్న న‌ల్ల‌ధ‌నం లేదా విలువైన వ‌స్తువుల‌ను ఏవి ఉన్నా స‌రే వాటిని చ‌ట్ట ప్ర‌కారం.. కేంద్ర ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తారు. అప్పుడు కేంద్రం వాటిని సంక్షేమ ప‌థ‌కాల‌కు లేదా అభివృద్ధి కోసం వాడుతుంది. ఇక దోషులు ఒక వేళ బ్యాంకు మోసానికి పాల్ప‌డి ఉంటే.. వారు బ్యాంకుల‌కు ఏమైనా బ‌కాయి ఉంటే.. అప్పుడు అలా స్వాధీనం చేసుకున్న సొమ్ము లేదా వ‌స్తువుల‌ను బ్యాంకుల‌కు అప్పు కింద జ‌మ చేస్తారు. దీంతో బ్యాంకుల‌కు అప్పులు తీర్చిన‌ట్లు అవుతుంది.

అయితే ఒక వేళ అధికారులు పెట్టిన కేసులు నిల‌బ‌డ‌క నిందితులు నిర్దోషులు అని తేలితే మాత్రం అధికారులు త‌మ అటాచ్‌మెంట్‌లో లేదా ఆధీనంలో ఉంచుకున్న ధ‌నం, వస్తువులు అన్నింటినీ మ‌ళ్లీ వెన‌క్కి ఇచ్చేయాలి. ఇలా ఈ వ్య‌వ‌స్థ కొన‌సాగుతుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈడీ దాడుల్లో భారీ మొత్తంలో న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట ప‌డుతుండ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM