Krishnam Raju Assets : రెబల్ స్టార్గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కృష్ణం రాజు కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. దాదాపుగా 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగగా.. ఆయన ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. రెబల్ స్టార్గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. రౌద్ర రసం, కరుణ రసం పండించడంలో ఆయనకి ఆయనే సాటి అని చెప్పవచ్చు.
కాగా కృష్ణం రాజు మృతితో అభిమానులు ఆయన జీవితాన్ని తలచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కృష్ణం రాజు ఆస్తుల గురించి చర్చించుకుంటున్నారు. కృష్ణం రాజు 1940 జనవరి 20న మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీ దేవి దంపతులకు జన్మించారు. వీరిది మొదటి నుంచి ధనిక కుటుంబమే. రాజ వంశానికి చెందినవారు. ఇక కృష్ణం రాజుకి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి ఉందట. అలాగే మొగల్తూరులో ఒక భవనం, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో మొత్తం నాలుగు ఖరీదైన ఇల్లు ఉన్నాయట.
ఇక కృష్ణం రాజు ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి ఖరీదు రూ.18 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాద్ లో కృష్ణం రాజుకి ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఇక గోపీకృష్ణ అనే నిర్మాణ సంస్థని కూడా కృష్ణం రాజు స్థాపించారు. కృష్ణం రాజు రూ.90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు, రూ.40 లక్షలు విలువైన టొయోటా ఫార్చునర్ కారు, రూ.90 లక్షల విలువైన వోల్వో ఎక్స్సి లాంటి కార్లను వాడుతున్నారు. అలాగే కృష్ణం రాజుది రాజుల కుటుంబం కాబట్టి వారి ఇంట్లో ఎప్పుడూ విందులు, పార్టీలు గ్రాండ్ గా జరుగుతూనే ఉంటాయి.
కృష్ణం రాజు లేదా ప్రభాస్ ఎవరైనా సరే.. తమ ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా.. నోరూరించే వంటకాలతో విందు భోజనం పెట్టిస్తారు. అందువల్లనే వారి విందుకు చాలా మంది ఫిదా అవుతుంటారు. ఇక ప్రభాస్ కూడా కృష్ణం రాజు లాగే షూటింగ్ సమయాల్లోనూ అందరికీ ఇంటి నుంచి వండిన విందు భోజనాన్ని తెప్పించి వడ్డిస్తుంటారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా ప్రభాస్ ఆతిథ్యానికి పడిపోయారు. ఇక ప్రభాస్ ఆస్తి విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ పెదనాన్ననే మించిపోయేలా సంపాదిస్తున్నాడు. కృష్ణం రాజుకి మొత్తం ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి ఉన్నారు. కుమారులు లేరు. అందువల్ల ప్రభాస్ ఆయన అంత్యక్రియలను దగ్గరుండి చేస్తారని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…