Anasuya : బుల్లితెరపై యాంకర్గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్ని, మూమెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే తనపై చేసే పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్కి అంతే దీటుగా ఆన్సర్ ఇస్తుంది అనసూయ.
అయితే అనసూయ కెరీర్ కష్టాల్లో నెట్టివేయబడిందని బుల్లితెర వర్గాల్లో చర్చ జరుగుతుంది. మల్లెమాల ఈటీవీ నుండి దూరం అయిన అనసూయ స్టార్ మాలో వరుసగా కార్యక్రమాలను చేయబోతున్నట్లుగా ఆమె ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు చెందిన స్టార్ మా కార్యక్రమాలు రావడం లేదు. అసలు ఇప్పట్లో ఆమె స్టార్ మా కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో కూడా తెలియదు. పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు మరింతగా రచ్చ చేశాయి.
దీంతో ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న మంచి పేరు మరియు ప్రతిష్టలు సన్నగిల్లాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే అనసూయ సినిమాల్లో మరియు బుల్లితెరపై ఒకప్పటిలా బిజీగా ఉండే అవకాశం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే అనసూయ ప్రస్తుతానికి ఖాళీ ఉన్నా భవిష్యత్తులో మళ్లీ పుంజుకుంటుందని.. ఆమె జబర్దస్త్ స్థాయిలో మళ్లీ స్టార్ మా ఛానల్ కి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటుందని కొందరు ఆశాభావంతో ఉన్నారు. ఒక వేళ అదే జరగకపోతే.. అనసూయ కెరీర్ డౌన్ ఫాల్ మొదలైనట్టే. చూడాలి ఏం జరుగుతుందో.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…