Kota Srinivasa Rao : టాలీవుడ్ సీనియర్ సినీ నటుల్లో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. మొదట్నుండి ఈయన వ్యవహార శైలి వేరుగానే ఉంటోంది. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ లో పలువురిపై కామెంట్స్ చేయడం షాకింగ్ గా మారింది. రీసెంట్ గా బుల్లితెర యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ గురించి తెలిసిందే. అలాగే మా ఎన్నికల క్రమంలో ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేశారు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు.. మా ఎలక్షన్స్ లో మంచు విష్ణుకు సపోర్ట్ చేశారనే విషయం పబ్లిక్ గానే తెలుసు.
ప్రకాష్ రాజ్ తో కలిసి దాదాపుగా తాను 15 సినిమాల్లో వర్క్ చేసినా.. ఆయన ఒక్కసారి కూడా టైమ్ కి వచ్చింది లేదని కామెంట్స్ చేసిన విషయమూ తెలిసిందే. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు లేకపోతే నాగబాబు అనేవాడు ఎవరు ? అంటూ ప్రశ్నించారు. ఆయనేమీ గొప్ప నటుడు కాదంటూ కామెంట్ చేశారు. గతంలో తాను ప్రకాష్ రాజ్ ని అనడంతో నాగబాబు తనను విమర్మించారని మండి పడ్డారు. అసలు నేను నాగబాబుని ఏమైనా కామెంట్ చేశానా.. రీసెంట్ గా ఆయన నాపై చేసిన కామెంట్స్ కి నేను టీవీ ఛానెల్స్ లో స్పందించి ఉంటే పెద్ద గొడవయ్యేదని కోట శ్రీనివాసరావు అన్నారు.
అలాగే అప్పుడు ఒక మాట, ఇప్పుడొక మాట చెప్పనని.. ఎప్పటికీ ఒకే మాట మీద ఉంటానని.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కనుక లేకపోతే నాగబాబు ఎవరో కూడా జనాలకు తెలీదని అన్నారు. ఇప్పటికీ ఆయన్ను ఎవరైనా సంబోధించాలంటే మెగా బ్రదర్ అనే అంటారని వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ పై చేసిన కామెంట్స్ కి కోట శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ.. కొంతమందికి వయస్సు పెరుగుతుంది గానీ.. బుద్ది పెరగడం లేదంటూ పోయే వయస్సుకు దగ్గరపడినా ఇంకెప్పుడు మారతారో అంటూ హీట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై నాగబాబును పలువురు నటీనటులు తప్పు పట్టారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ అనేవి ఎంతోమంది నటుల్ని హైలెట్ చేశాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…