Aha OTT : ఇన్నాళ్లూ వెండితెరపై అలరించిన హీరోలు ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. ఓటీటీ రంగంలో కూడా అడుగుపెడుతున్నారు. తొలి తెలుగు ఓటీటీ ఆహా.. టాక్ షోలతో సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టగా, ఆ మధ్య సమంత సామ్ జామ్ అనే షో చేసింది. ఇప్పుడు బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నాడు. నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొని ఉంది.
ఆహా టాక్ షో కోసం బాలయ్య బాబు ఏకంగా రూ. 40 లక్షలు తీసుకోనున్నాడనేది సమాచారం. తొలి సీజన్లో 12 ఎపిసోడ్లు ఉండనున్నట్లు సమాచారం. అంటే ఎంత కాదన్నా ఈ షో కోసం బాలకృష్ణ రూ. 5 కోట్లు తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక బాలకృష్ణ తర్వాత మరో సీనియర్ ఆహా కోసం హోస్ట్గా మారబోతున్నట్టు సమాచారం. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలు పోషించి కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు.
త్వరలో మోహన్ బాబు ఆహా టాక్ షో కోసం హోస్ట్గా మారబోతున్నాడని అంటున్నారు. పలువురిని తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు చేసి అందరినీ అలరించనున్నారని టాక్. దీనిపై అతి త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…