Kiara Advani : నటి కియారా అద్వానీ బోల్డ్ సన్నివేశాల్లో చేసేందుకు ఎంత మాత్రం మొహమాట పడదనే చెప్పవచ్చు. ఆ మాటకొస్తే ఆమె నటించిన కొన్ని సిరీస్లలో విపరీతమైన బోల్డ్ క్యారెక్టర్లలో నటించింది. అయితే ఇప్పుడు ఆమె అడ్వర్టయిజ్మెంట్ల విషయంలోనూ అదే పద్ధతిని పాటిస్తోంది. ఏ బ్రాండ్కు యాడ్ చేసినా.. స్కిన్ షో చేస్తోంది. అది సరే.. అంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. తేడా వస్తే మాత్రం నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కు గురి కాక తప్పడం లేదు. తాజాగా కియారాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
కియారా అద్వానీ ఇటు తెలుగు, అటు హిందీ మూవీల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే పలు బ్రాండ్లకు ప్రచారం కూడా చేస్తోంది. ఇక బోట్ కంపెనీకి కూడా ఆమె బ్రాండ్ అంబాసిడర్గా ఎప్పటినుంచో కొనసాగుతోంది. సదరు కంపెనీ పలు రకాల ఆడియో ప్రొడక్ట్స్ను తయారు చేయడంలో పేరు గాంచింది. అయితే ఆ కంపెనీకి చెందిన వైర్లెస్ ఇయర్బడ్స్ ప్యాక్పై కియారా అద్వానీ ఫొటోను ముద్రించారు.
సదరు ఫొటోలో కియారా స్పోర్ట్స్ బ్రా ధరించి ఉంది. కానీ ఆమె చెవుల్లో ఉన్న బోట్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
అసలు ఆమె ఇయర్ బడ్స్ కు ప్రచారం చేస్తుందా.. లేదా స్కిన్ షో చేస్తుందా.. లేక ఏదైనా కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బ్రాను ప్రచారం చేస్తుందా..? అని కియారా అద్వానీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ ఫొటోను 1 నిమిషం పాటు జాగ్రత్తగా చూస్తేనే తప్ప ఆమె చెవుల్లో ఇయర్ బడ్స్ ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో ఆ ఫొటోను చూస్తే నిజంగానే అది స్పోర్ట్స్బ్రాకు చెందిన యాడ్ అనుకుంటారు. అందుకనే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్లో భూల్ భులయ్యా 2 అనే మూవీతోపాటు జుగ్ జుగ్ జీయో అనే మూవీలోనూ నటిస్తోంది. తెలుగులో ఈమె రామ్ చరణ్ సరసన మూవీలో నటిస్తోంది. ఆ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…