Kiara Advani : నటి కియారా అద్వానీ బోల్డ్ సన్నివేశాల్లో చేసేందుకు ఎంత మాత్రం మొహమాట పడదనే చెప్పవచ్చు. ఆ మాటకొస్తే ఆమె నటించిన కొన్ని సిరీస్లలో విపరీతమైన బోల్డ్ క్యారెక్టర్లలో నటించింది. అయితే ఇప్పుడు ఆమె అడ్వర్టయిజ్మెంట్ల విషయంలోనూ అదే పద్ధతిని పాటిస్తోంది. ఏ బ్రాండ్కు యాడ్ చేసినా.. స్కిన్ షో చేస్తోంది. అది సరే.. అంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. తేడా వస్తే మాత్రం నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కు గురి కాక తప్పడం లేదు. తాజాగా కియారాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
కియారా అద్వానీ ఇటు తెలుగు, అటు హిందీ మూవీల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే పలు బ్రాండ్లకు ప్రచారం కూడా చేస్తోంది. ఇక బోట్ కంపెనీకి కూడా ఆమె బ్రాండ్ అంబాసిడర్గా ఎప్పటినుంచో కొనసాగుతోంది. సదరు కంపెనీ పలు రకాల ఆడియో ప్రొడక్ట్స్ను తయారు చేయడంలో పేరు గాంచింది. అయితే ఆ కంపెనీకి చెందిన వైర్లెస్ ఇయర్బడ్స్ ప్యాక్పై కియారా అద్వానీ ఫొటోను ముద్రించారు.
సదరు ఫొటోలో కియారా స్పోర్ట్స్ బ్రా ధరించి ఉంది. కానీ ఆమె చెవుల్లో ఉన్న బోట్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
అసలు ఆమె ఇయర్ బడ్స్ కు ప్రచారం చేస్తుందా.. లేదా స్కిన్ షో చేస్తుందా.. లేక ఏదైనా కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బ్రాను ప్రచారం చేస్తుందా..? అని కియారా అద్వానీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ ఫొటోను 1 నిమిషం పాటు జాగ్రత్తగా చూస్తేనే తప్ప ఆమె చెవుల్లో ఇయర్ బడ్స్ ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో ఆ ఫొటోను చూస్తే నిజంగానే అది స్పోర్ట్స్బ్రాకు చెందిన యాడ్ అనుకుంటారు. అందుకనే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్లో భూల్ భులయ్యా 2 అనే మూవీతోపాటు జుగ్ జుగ్ జీయో అనే మూవీలోనూ నటిస్తోంది. తెలుగులో ఈమె రామ్ చరణ్ సరసన మూవీలో నటిస్తోంది. ఆ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…